ఏం మాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార సమంత అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఈ బ్యూటీ దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అనంతరం నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని కోడలుగా మారింది.
అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో వైవాహిక జీవితంలో ఎదురైన సంఘటనలు సామ్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.
వైవాహిక జీవితం నుంచి బయటకు రావడం ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడడం తీవ్ర ఇబ్బందికి గురి చేశాయి. అయితే బౌన్స్ బ్యాక్ అయిన సమంత మళ్లీ కెరీర్లో ముందుకు సాగుతోంది.
కొన్ని రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత పుష్ప1లో 'ఊ అంటావా' అనే పాటతో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించిందీ చిన్నది.
3 నిమిషాల నిడివి ఉండే ఈ పాటకు సమంత ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.
తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. కాగా సామ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.