బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 'అనిమల్' సినిమాతో బాబీ డియోల్ మళ్ళీ వెండితెరపైకి వచ్చారు. `డాకు మహారాజ్`లో ఆయన విలన్గా చేశారు.
కొన్ని సినిమాల్లో బాబీ విలన్ గా నటించారు, కానీ కెరీర్ ప్రారంభంలో ఆయన చాక్లెట్ బాయ్. హీరోగానూ అనేక సినిమాలు చేసి స్టార్గా వెలుగొందారు.
1997 లో 'ఔర్ ప్యార్ హో గయా' సినిమా విడుదలైంది. బాబీ డియోల్, ఐశ్వర్యా రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు.
బాబీ దేవల్ వల్లే ఐశ్వర్యా రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ ని మొదటిసారి కలిశారట. అదెలా అనేది చూస్తే.
2021లో యూట్యూబర్ తో అభిషేక్ మాట్లాడుతూ, "నేను ఐశ్వర్యని మొదటిసారి ప్రొడక్షన్ బాయ్ గా ఉన్నప్పుడు కలిశాను" అని చెప్పారు.
అభిషేక్ బచ్చన్ తన తండ్రి అమితాబ్ బచ్చన్ సినిమా లోకేషన్ చూడటానికి స్విట్జర్లాండ్ వెళ్లారు. "నేను కొన్ని రోజులు ఒంటరిగా అక్కడ ఉన్నాను" అని అభిషేక్ గుర్తు చేసుకున్నారు.
స్విట్జర్లాండ్ లో అభిషేక్ బాల్య స్నేహితుడు బాబీ డియోల్ 'ఔర్ ప్యార్ హో గయా' షూటింగ్ చేస్తున్నారు. నేను అక్కడ ఉన్నానని వాళ్లకు తెలిసింది.
బాబీ డియోల్ "డిన్నర్ కి ఎందుకు రావు?" అని అడిగారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్లాను. అక్కడ మొదటిసారి ఐశ్వర్యని కలిశాను.
రణవీర్ అభిషేక్ ని "ఐశ్వర్యపై క్రష్ ఉందా?" అని అడిగినప్పుడు, "ఎవరికి ఉండదు?" అని అభిషేక్ బదులిచ్చారు. తొలి చూపులోనే ఐష్కి పడిపోయాడట అభిషేక్.