Cricket

రి౦కూ సింగ్ తో ప్రియా సరోజ్ ఎంగేజ్​మెంట్.. నిజమేనా?

సోషల్ మీడియాలో వైరల్

భారత క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం అయిపోయిందట. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఆయన నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

జనవరి 22 నుంచి ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు

రి౦కూ సింగ్ టీ20 ప్రప౦చ కప్ 2024 విజేత జట్టులో ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్నారు. జనవరి 22 నుంచి ఇంగ్లాండ్‌తో మొదలయ్యే సిరీస్‌లో ఆడతారు.

ఐపీఎల్ 2023తో ఫేమస్ అయిన రింకూ

ఐపీఎల్ 2023తో రింకూ సింగ్ ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2024 సీజన్‌లో 18.67 సగటుతో 168 పరుగులు చేశారు. కేకేఆర్ మూడో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

నిశ్చితార్థంపై అధికారిక ప్రకటన లేదు

రి౦కూ సింగ్, ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తను అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.

సమాజ్‌వాదీ పార్టీ యువ నేత ప్రియా

ప్రియా సరోజ్ 1998 నవ౦బర్ 23న వారణాసిలో జన్మించారు. సమాజ్‌వాదీ పార్టీ యువ నేత. మచిలిషహర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రియా విజయం

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి ప్రియా సరోజ్ గెలిచారు. తండ్రి తూఫానీ సరోజ్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

యూపీ రాజకీయాల్లో ప్రియా సరోజ్

ప్రియా సరోజ్ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ యువ నేతగా ముఖ్యమైన అంశాలపై గళం వినిపిస్తూ, కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు.

తూఫానీ సరోజ్ ఏం చెప్పారంటే?

ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ ఎంగేజ్ మెంట్ వార్తలను ఖండించారు. రింకూ సింగ్ - ప్రియా సరోజ్ ల నిశ్చితార్థం పై వస్తున్న వార్తలను ఫేక్ అని పేర్కొన్నారు.

Image credits: Social Media

ఐపీఎల్ 2025: ఈ స్టార్ ఆటగాళ్లకు చివరి సీజన్?

KKR స్టార్ బ్యాట్స్‌మన్ శిలాజిత్ సీక్రెట్ !

సినిమాల్లో మెరిసిన క్రికెటర్లు వీళ్లే!

సచిన్ టెండూల్కర్ బిడ్డల్లో ఎవరి సంపాదన ఎక్కువ : అర్జున్ దా? సారాదా?