business
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. పది రూపాయాల లావాదేవీకి కూడా యూపీఐ వాడుతున్నారు. అయితే ఇలా యూపీఐ పేమెంట్స్ చేస్తే తెలియకుండానే ఖర్చు ఎక్కువవుతుంది.
ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బిఐ తమ యూజర్ల కోసం యూపీఐ లావాదేవీలకు ఒక లిమిట్ నిర్ణయించింది. మీ అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు.
అనవసర ఖర్చులు నివారించేందుకు ఎస్బీఐ యూపీఐ లావాదేవీలపై కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో మీకు నచ్చినట్లు యూపీఐ పేమెంట్ లావాదేవీలను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
యూపీఐ ద్వారా ఒక వ్యక్తి గరిష్టంగా రోజుకు రూ. 1,00,000 వరకు లావాదేవీ చేయొచ్చు. కొన్ని బ్యాంకులు ఇంత కంటే తక్కువ లావాదేవీకి అనుమతిస్తాయి.
ఇక ఎస్బీఐ యూపీఐ లిమిట్ ను తగ్గించుకోవాలన్నా, పెంచుకోవాలన్నా యోనో యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అయితే సరి.
ముందు యోనో లేదా నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అవ్వాలి. యూపీఐ బదిలీపై క్లిక్ చేసి, యూపీఐ లావాదేవీ లిమిట్ సెట్ సెలక్ట్ చేసి, పాస్వర్డ్ వేసి వెరిఫై చేసి, కొత్త లిమిట్ సెట్ చేసుకోవాలి.
ఉదాహరణకు ప్రస్తుతం మీ లిమిట్ రూ. 50 వేలు ఉంటే. ఎంత కావాలో ఎంటర్ చేసి ‘సబ్మిట్’ క్లిక్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ చేయండి. కొత్త యూపీఐ లిమిట్ అమలులోకి వస్తుంది.
యూపీఐ లిమిట్ సెట్ చేసుకోవడం వల్ల మీరు చేస్తున్న లావాదేవీలపై మీకు ఓ నియంత్రణ ఉంటుంది. అనవసర ఖర్చు అదుపులోకి వస్తుంది.