Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇద్దరు మహిళలు

మహిళల ఆర్థిక కష్టాలను ఆసరాగా చేసుకుని వారితో వ్యభిచారం చేయిస్తున్న ఓ వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసారు. ఇద్దరు మహిళలను కాపాడి రెస్క్చూ హోం కు తరలించారు. 

Police raid on brothel house at hyderabad
Author
Hyderabad, First Published Nov 5, 2021, 10:55 AM IST

హైదరాబాద్: మహిళల ఆర్థిక కష్టాలను ఆసరాగా చేసుకుని డబ్బుల ఆశచూపి వారిని వ్యభిచారం కూపంలోకి లాగుతున్నాడో దుర్మార్గుడు. ఇలా నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలను ఈ నరకకూపంలోకి వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు కటకం సాయికుమార్. ఈ గదిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల ఆర్థిక అవసరాలను తీరుస్తానంటూ మొదట నమ్మించి ఆ తర్వాత మెల్లిగా వారిని వ్యభిచార కూపంలోకి లాగేవాడు. వారితో అద్దెకు తీసుకున్న గదిలో వ్యభిచారం చేయించేవాడు. 

ఇలా ఇటీవల ఇద్దరు మహిళలతో అతడు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందింది. దీంతో సాయికుమార్ కదలికలపై నిఘా వుంచిన పోలీసులు వ్యభిచారం దందా నిర్వహిస్తున్నాడని నిర్దారించుకున్నారు. దీంతో మహిళలతో పాటు ఇద్దరు మహిళలు గదిలో వుండగా దాడిచేసిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

brothel house నిర్వహకుడు సాయిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పట్టుబడిన ఇద్దరు అమ్మాయిలను రెస్క్యూ హోంకు తరలించారు. సాయి లాంటి దుర్మార్గుల మాటల నమ్మి అమ్మాయిలు మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

read more  సొంత చెల్లిని వ్యభిచారంలోకి దింపిన అక్క.. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో..

ఇదిలావుంటే ఇటీవల మైనర్ బాలికను వ్యభిచార రొంపిలోకి దించి గలీజ్ దందా చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో రాచకొండ కమీషనరేట్ లోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఓ ఇంటిపై దాడి చేసి ఓ మైనర్ బాలికతో పాటు ఓ విటుడు, ముగ్గురు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. 

బాలాపూర్ లోని రాయల్ కాలనీలో రెహానా బేగం, సల్మా, సయ్యద్ అబుబకర్ brothel house నిర్వహిస్తున్నారు. hyderabadలోని అమ్మాయిలనే కాదు ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది ఈ ముఠా. ఇటీవల బిహార్ కు చెందిన 17ఏళ్ల మైనర్ బాలికను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది. మైనర్ బాలికను చూపి వివిధ మాధ్యమాల ద్వారా యువకులను ఆకర్షిస్తూ గలీజ్ దందా జోరుగా సాగిస్తోంది ఈ ముఠా. 

 అయితే గుట్టుగా వ్యభిచారం సాగిస్తున్నా నిత్యం ఆ ఇంటికి కొత్తవారు ఎక్కువగా వస్తుండటంతో కాలనీవాసులకు అనుమానం వచ్చింది. దీంతో కొందరు పోలీసులకు సమాచారం అందించగా రాచకొండ కమీషనరేట్ లోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అప్రమత్తమైంది. ఆ ఇంటిపై నిఘా వుంచి వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. ఆ ఇంటిపై దాడిచేసి ముగ్గురు నిర్వహకులతో పాటు మైనర్ బాలికను, 20ఏళ్ల విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుండి రూ.2,420 నగదు, 3సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios