Asianet News TeluguAsianet News Telugu

15 రోజుల క్రితమే అమ్మమ్మ: దిశ ఫ్యామిలీపై దెబ్బ మీద దెబ్బ

శంషాబాద్ లో గ్యాంగ్ రేప్ , హత్యకు గురైంది దిశ. వరుసగా ఆ కుటుంబంలో విషాద ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.

Justice for Disha:serial sad incidents in Disha family
Author
Hyderabad, First Published Dec 3, 2019, 1:14 PM IST | Last Updated Dec 3, 2019, 1:14 PM IST

హైదరాబాద్: షాద్‌నగర్ సమీపంలో గ్యాంగ్‌రేప్‌కు గురై హత్యకు గురైన దిశ (తెలంగాణ నిర్భయ) కుటుంబానికి వరుసగా కష్టాలు వచ్చి పడుతున్నాయి.

వరుస కష్టాలతో ఆ కుటుంబం కోలుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటుంది.  విషాదాల నుండి కోలుకోనే సమయంలోనే దిశ మృతి ఆ కుటుంబాన్ని మరింత ఇబ్బందులకు గురి చేసింది.  దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 

ఉన్నత వృత్తిలో కొనసాగుతున్న దిశ వారం రోజుల క్రితం శంషాబాద్ సమీపంలో దారుణంగా గ్యాంగ్‌రేప్‌కు గురై హత్యకు గురైంది.ఈ గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Also read:జస్టిస్ ఫర్ దిశ: జంతర్ మంతర్‌ వద్ద ఆమరణ దీక్షకు దిగిన స్వాతి

తెలంగాణ నిర్భయ అమ్మమ్మ  15 రోజుల క్రితం మరణించింది. దిశ తల్లి ఈ బాధ నుండి ఇప్పుడిప్పుడే కోలుకొంటుంది. దిశ తల్లి ఈ బాధ నుండి  తేరుకొంటుంది. దిశతో కలిసి ఉదయాన్నే ఆమె వాకింగ్ కు వెళ్తోంది.

తమ కాలనీవాసులతో ఇదే విషయాన్ని దిశ తల్లి ఇటీవల ఈ విషయాన్ని ప్రస్తావించింది. మా అమ్మ మరణించిన బాధ నుండి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నట్టుగా దిశ తల్లి కాలనీవాసులతో తన అభిప్రాయాలను ఇటీవల పంచుకొన్నారు. దిశతో కలిసి తల్లి ఇటీవలనే మార్నింగ్ వాకింగ్ కు వెళ్తుంది.

Also Read: జస్టిస్ ఫర్ దిశ: వెటర్నరీ డాక్టర్ కావడానికి కారణమిదే

ఇప్పుడిప్పుడే తమ కుటుంబం కోలుకొంటుందని దిశ తల్లి చెప్పారు. ఈ విషయాన్ని కాలనీవాసులు గుర్తు చేసుకొంటున్నారు. తల్లిని కోల్పోయిన  బాధ నుండి కోలుకోక ముందే దిశ  మృతి చెందింది. ఈ రెండు ఘటనలతో  ఈ కుటుంబం కోలుకోలేని దెబ్బతిందని  స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న  దిశ రేప్, హత్య  ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.   దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios