Asianet News TeluguAsianet News Telugu

బ్రెజిల్ టూరిస్టుపై గ్యాంగ్ రేప్ ఘటనను సుమోటుగా స్వీకరించిన జార్ఖండ్ హైకోర్టు

బ్రెజిల్ టూరిస్టుపై జార్ఖండ్‌లో ఏడుగురు దుండగులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆధారం చేసుకుని జార్ఖండ్ హైకోర్టు సుమోటుగా స్వీకరించి విచారణ ప్రారంభించింది.
 

jharkhand high court took suo moto cognisance of gang rape of brazilian woman in the state kms
Author
First Published Mar 4, 2024, 8:12 PM IST

Jharkhand: ఓ బ్రెజిలియన్ టూరిస్టుపై జార్ఖండ్‌లో గ్యాంగ్ రేప్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆధారం చేసుకుని జార్ఖండ్ హైకోర్టు సుమోటుగా విచారణ చేపట్టింది. ఏడుగురు దుండగులు బ్రెజిలియన్ టూరిస్టుపై దుంకా జిల్లాలో సామూహిలక లైంగిక దాడికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి.

చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, న్యాయమూర్తి నవనీత్ కుమార్‌ల ధర్మాసనం ఈ ఘటనను విచారించింది. ఈ ఘటనపై సమాధానం ఇవ్వాలని డీజీపీ, ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

Also Read: KA Paul: బాబు మోహన్ సంచలన నిర్ణయం.. కేఏ పాల్ పార్టీలో చేరిక

ఈ ఘటనకు సంబంధించిన పలు వార్తా నివేదికలను జార్ఖండ్ హైకోర్టు అడ్వకేట్ల అసోషియేషన్ అధ్యక్షుడు రీతు కుమార్ సోమవారం ఉదయం కోర్టు ముందు ఉంచారు. ఈ వార్తలను పరిశీలించిన తర్వాత ఘటనను సుమోటుగా స్వీకరించి విచారించాలని కోర్టు నిర్ణయానికి వచ్చింది. విదేశీ మహిళలపై నేరాలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చుతాయని కోర్టు పేర్కొంది. అది పర్యాటకంపైనా ప్రభావం చూపుతుందని వివరంచింది.

ఈ ఘటన మార్చి 1వ తేదీన చోటుచేసుకుంది. బ్రెజిలియన్ మహిళ, తన భర్తతో కలిసి మోటర్ బైక్ టూర్‌లో ఉన్నారు.ఆ రోజు రాత్రి కోసం దుంకా జిల్లాలో ఆగారు. ఆ తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. తాను ఎదుర్కొన్న దారుణాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వివరించింది. ఏడుగురు దుండగులు తనను రేప్ చేశారని పేర్కొంది. తన భర్తపై దాడి చేశారని వివరించింది. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడుగురిలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు జరుగుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios