Asianet News TeluguAsianet News Telugu

భార‌త‌దేశ విద్యావిధానం 2020లో కొత్త మార్పులు..!

భార‌త‌దేశ విద్యావ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ముంద‌డుగు వేసింది. బుధ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో స‌మావేశ‌మైన కేంద్ర క్యాబినెట్.. ఇస్రో మాజీ చీఫ్ కే క‌స్తూరీరంగ‌న్ క‌మిటీ సిఫార‌సు మేరకు జాతీయ నూత‌న విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. 

Union Cabinet approved a new National Education Policy on July 29
Author
Hyderabad, First Published Aug 3, 2020, 6:58 PM IST

34 సంవత్సరాల విరామం తరువాత జూలై 29న కేంద్ర జాతీయ మంత్రివర్గం కొత్త జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించింది.భార‌త‌దేశ విద్యావ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ముంద‌డుగు వేసింది. బుధ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో స‌మావేశ‌మైన కేంద్ర క్యాబినెట్.. ఇస్రో మాజీ చీఫ్ కే క‌స్తూరీరంగ‌న్ క‌మిటీ సిఫార‌సు మేరకు జాతీయ నూత‌న విద్యా విధానానికి ఆమోదం తెలిపింది.

క‌స్తూరీరంగ‌న్ క‌మిటీ సిఫార‌సు మేర‌కే కేంద్ర‌ మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌ను విద్యాశాఖ‌గా మారుస్తూ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. కేబినెట్ ఆమోదించిన కొత్త ఎన్‌ఇపిని పార్లమెంటులో సమర్పించలేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రూపొందించిన 21 వ శతాబ్దంలో ఇది మొదటిది. ఇది ఒక విధానం మాత్రమే చట్టం కాదు విద్య ఏకకాలంలో ఉన్నందున దాని ప్రతిపాదనలు రాష్ట్రాల అమలు, కేంద్రం రెండింటిపై ఆధారపడి ఉంటుంది.

1.కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ పేరు విద్యా శాఖగా మార్చాలి.
2.2035 కల్లా 50 శాతం గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోకు చేరాలి. 2040 కల్లా అన్ని ఉన్నత విద్యా సంస్థలు విభిన్న కోర్సులను అందించే సంస్థలుగా మారి, ప్రతి విద్యా సంస్థలో 3000 అంత కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండాలి. 
3.అయిదవ తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలు బోధించాలి. బోర్డు పరీక్షలను విద్యార్థి సముపార్జించిన జ్ఞానాన్ని పరీక్షించే విధంగా తీర్చిదిద్ది, మూస తరహా పరీక్లకు స్వస్తి ప‌ల‌కాలి. 
4.పిల్లల రిపోర్ట్ కార్డులలో కేవలం వివిధ సబ్జెక్టులలో వచ్చిన మార్కులు మాత్రమే కాకుండా వారి ఇతర నైపుణ్యాలకు కూడా మార్కులు ఇవ్వాలి.
5.విద్యా విధానాన్ని ఇప్పుడున్న 10 + 2 నుంచి 5+3+3+4 గా విభజించాలి. మొదటి అయిదేండ్ల‌లో ప్రీ ప్రైమరీ నుంచి రెండో తరగతి వరకు ఉంటాయి. 6.రెండో దశలో మూడు నుంచి అయిదో తరగతి వ‌ర‌కు, తర్వాత దశలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వ‌ర‌కు, చివరి నాలుగేండ్ల‌లో తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకు ఉంటాయి.
7.పిల్లలు తమకు నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని కోర్సులను రెండు భాషలలో అందిస్తారు.
8.అన్ని పాఠశాలల్లో సంస్కృత భాషను ముఖ్య భాషగా ప్రవేశపెట్టాలి. సంస్కృత విద్యాలయాలు కూడా విభిన్న తరహా కోర్సులు అందించే విద్యా సంస్థలుగా రూపాంతరం చెందాలి. 
9.డిజిటల్ విద్యావిధానాన్ని అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్‌ను స్థాపించాలి. ఎనిమిది ప్రాంతీయ భాషలలో ఈ-కోర్సులు. వర్చ్యువల్ ల్యాబ్స్‌ అభివృద్ధి చేయాలి.
10.ఉన్నత విద్యనభ్యసించేందుకు మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను కల్పించాలి. దీంతో ఎవరైనా మధ్యలో కోర్సు వదిలి వెళ్ళిపోతే తిరిగి చేరినప్పుడు గతంలో వచ్చిన మార్కులను వాడుకునే అవకాశం ఉంటుంది.
11.3-18 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు వారికి వర్తించేలా విద్యాహక్కు చట్టం-2009ని విస్తరించాలి. 
12.పాఠశాలలను పాఠశాలల సముదాయాలుగా పునర్‌వ్య‌వస్థీకరించాలి.
13.పాఠశాల విద్యాప్రణాళికలో విషయ పరిజ్ఞాన భారాన్ని తగ్గించాలి.

also read ఆన్‌లైన్‌లో సి‌ఐ‌పి‌ఈ‌టి జేఈఈ అడ్మిట్ కార్డులు విడుదల.. ...
14.ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌,  క్రీడలు, యోగా, కమ్యూనిటీ సర్వీస్‌, సంగీతం లాంటి అంశాల‌ను అన్ని సబ్జెక్టుల్లో కరిక్యులర్‌, కో కరిక్యులర్‌, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ పేరిట వేరు చేయాల్సిన అవసరం లేదు.
15.క్రియాశీల బోధనను ప్రోత్సహించడం ద్వారా జీవన నైపుణ్యాలు, 21వ శతాబ్దపు నైపుణ్యాలు సహా ఇత‌ర‌ కీలక సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
16.ఉపాధ్యాయ విద్యలో భారీ మార్పులు చేయాలి. నాణ్యతలేని ఉపాధ్యాయ విద్యాసంస్థలను మూసివేయాలి.
17.ఉపాధ్యాయ సన్నద్ధత విద్యాకార్యక్రమాలు అన్నింటినీ యూనివర్సిటీలు, అన్ని విభాగాలు క‌లిగిన‌ కళాశాలలకు తరలించాలి.
18.నాలుగేండ్ల‌ ఇంటిగ్రేటెడ్ స్థాయి బీఈడీ విద్య‌ను టీచర్ల ఉద్యోగాల‌కు కనీస డిగ్రీ అర్హతగా మార్చాలి.
19.ఉన్నత విద్యాసంస్థలను మూడు రకాలుగా పునర్నిర్మించాలి. అవి.. 1. ప్రపంచశ్రేణి పరిశోధన, అత్యంత నాణ్యమైన బోధన, 2. వివిధ విభాగాల్లో పరిశోధనల్లో భాగస్వామ్యం కల్పించేలా అత్యున్నత బోధనపై దృష్టి 3. మిషన్‌ నలంద, మిషన్‌ తక్షశిల పేరిట అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యలో అత్యంత నాణ్యమైన బోధనపై దృష్టి
20.కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించేందుకు కొత్తగా రాష్ట్రీయ శిక్షా ఆయోగ్‌ సంస్థను నెలకొల్పాలి.
21.ఉన్నత విద్యలో పటిష్ఠ పరిశోధనా సంప్రదాయం, సామర్థ్యాలను పెంపొందించేందుకు జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలి.
22.నాణ్యతా ప్రమాణాల ఏర్పాటు, నిధులు, గుర్తింపు, నియంత్రణ.. ఈ నాలుగు కార్యకలాపాలను ప్రస్తుతం జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ చూస్తున్న‌ది. ఇకపై వీటిని వేరుచేసి వాటి నిర్వహణను స్వతంత్ర సంస్థలకు అప్పగించాలి.
23.పునర్వ్యవస్థీకరించిన న్యాక్‌ నేతృత్వంలో గుర్తింపునకు ఒక అంతర్గత వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
24. వృత్తి విద్యలో ప్రమాణాలను నిర్ధారించే సంస్థలు, యూజీసీని ఉన్నత విద్యా గ్రాంట్స్‌ కమిషన్‌గా మార్చాలి.
25. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను సమానంగా చూడాలి. విద్యను లాభాపేక్షరహితంగానే ఉంచాలి.
26.ఉన్నత విద్యలో గ్లోబ‌లైజేష‌న్‌ను ప్రోత్సహించేందుకు అనేక కొత్త విధానాలను ప్రవేశపెట్టాలి. 
27.సార్వత్రిక, దూర విద్యావిధానంలో నాణ్యతను పెంచాలి. అన్ని స్థాయిల విద్యలో టెక్నాలజీని భాగం చేయాలి. 
28. విద్యాభ్యాసంలో లింగ వివక్ష, సామాజిక వర్గీకరణలు, ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించాలి.
29.భారతీయ, శాస్త్రీయ భాషలను ప్రోత్సహించాలి. పాలి, పర్షియన్‌, ప్రాకృత భాషలకు మూడు కొత్త జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాలి.
30.ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేష‌న్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ (ఐఐటీఐ) ఏర్పాటు చేయాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios