Asianet News TeluguAsianet News Telugu

నాటు వైద్యం చేయిస్తానని తీసుకెళ్లి.. మైనర్ బాలికతో బలవంతంగా వ్యభిచారం.. ఆరోగ్యం క్షీణించడంతో...

పల్నాడులోని ఓ  పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలికకు  13 ఏళ్లు. కరోనా బారిన పడి జిజిహెచ్ లో చేరింది. గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన ఓ మహిళ నమ్మించి తన వెంట ఇంటికి తీసుకెళ్లిన కొద్ది రోజులకే  వ్యభిచారం  చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఆ పని చేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను ఇంట్లో బంధించి, బయటకు రానీయకుండా కొన్నాళ్ళు గుంటూరులో ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడకు సైతం తీసుకెళ్లి  వ్యభిచారం  చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Forced prostitution with a 13-year-old girl, Suspicion on the role of father in guntur
Author
Hyderabad, First Published Dec 18, 2021, 7:57 AM IST

గుంటూరు : భార్య, కూతురికి corona virus సోకడంతో గుంటూరు GGHలో చేర్పించాడు ఓ భర్త. అక్కడ వారిద్దరూ చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్లో భార్య చనిపోయింది. ఆ బాలికకు తండ్రి తప్ప మరెవరూ లేరని guntur స్వర్ణ భారతి నగర్ కు చెందిన ఓ మహిళ తెలుసుకుంది. తాను ఆస్పత్రిలో నర్సు అని ఆ బాలిక తండ్రిని నమ్మించింది. నాటువైద్యం చేయిస్తానని బాలికను ఇంటికి తీసుకెళ్ళి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో prostitution చేయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనారోగ్యం పాలైన ఆ బాలిక రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకుని జరిగిన విషయం తండ్రికి చెప్పింది. తండ్రి ఫిర్యాదు మేరకు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసు స్టేషన్లో 
Zero FIR నమోదు చేసి కేసును అరండల్ పేట స్టేషన్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం  ఆ బాలికకు వైద్య పరీక్షలు  చేస్తున్నారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితురాలు  వ్యభిచారం నిర్వాహకురాలు అని, 
Nurse కాదని పోలీసులు తెలుసుకున్నారు

పోలీసుల కథనం ప్రకారం..  పల్నాడులోని ఓ  పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలికకు  13 ఏళ్లు. కరోనా బారిన పడి జిజిహెచ్ లో చేరింది. గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన ఓ మహిళ నమ్మించి తన వెంట ఇంటికి తీసుకెళ్లిన కొద్ది రోజులకే  వ్యభిచారం  చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఆ పని చేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను ఇంట్లో బంధించి, బయటకు రానీయకుండా కొన్నాళ్ళు గుంటూరులో ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడకు సైతం తీసుకెళ్లి  వ్యభిచారం  చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు అరెస్ట్: గుజరాత్‌ నుండి విజయవాడకు తరలింపు

గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యం పాలవడంతో  వ్యభిచారం  నిర్వాహకురాలు ఆ బాలికను విజయవాడలో వదిలేయడంతో ఇంటికి చేరిందని అనుమానిస్తున్నారు. బాలిక తండ్రి గుంటూరులో ఓ ఫ్యాక్టరీలో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. ఆ బాలిక తప్పిపోయినట్లు సుమారు 2 నెలల క్రితం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలియడంతో నల్లపాడు పోలీసులు కేసును క్లోజ్ చేశారు. 

రెండు నెలల క్రితం ఆ బాలిక నెల్లూరులో ఉందని  తెలిస్తే అదుపులోకి తీసుకోకుండా ఇన్నాళ్ల పాటు ఇది దీన్ని గోప్యంగా ఉంచడం ఏమిటి? ఇప్పటిదాకా ఆ బాలిక ఎవరి చెరలో ఉంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ బాలికను తండ్రే అప్పగించారా? దీని వెనుక ఏమైనా బేరసారాలు జరిగాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. దీనిపై గుంటూరు సౌత్ డిఎస్పి జెస్సీ ప్రశాంతిని వివరణ కోరగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ధ్రువీకరించారు.

నిందితులు వ్యభిచారం చేయిస్తారని ధ్రువీకరించుకున్నామన్నారు. అయితే వారు ప్రస్తుతం ఫోన్లు స్విఛాఫ్ చేసి ఉంచారని, ఆ బాలిక కోలుకున్నాక పూర్తిస్థాయిలో విచారిస్తామని తెలిపారు. ప్రస్తుతం బాలిక నుంచి స్టేట్మెంట్ తీసుకుని వైద్య పరీక్షలకు పంపినట్టు చెప్పారు. ప్రస్తుతం మేడికొండూరులో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరండల్ పేటకు బదిలీ చేశామని, ఈ స్టేషన్ పరిధిలోనే ఆ బాలిక ఎక్కువ రోజులు ఉండటంతో కేసును ఇక్కడికి బదిలీ చేసినట్లు వెల్లడించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios