business
ఆర్డర్ చేసిన నిమిషాల్లో డెలివరీ చేసే క్విక్కామర్స్ రంగం ప్రస్తుతం విస్తరిస్తోంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సైతం పది నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు.
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్త బ్లింకిట్ కొత్త సేవను ప్రారంభించింది. ఇందులో భాగంగా సిమ్లను ఇంటి వద్దకు అందించనున్నారు.
బ్లింకిట్తో కలిసి ఎయిర్ టెల్ తన కస్టమర్లకు కేవలం 10 నిమిషాల్లోనే ఇంటి వద్దకు సిమ్ కార్డుల డెలివరీని అందించనున్నట్లు ప్రకటించింది.
ఈ సేవలను తొలుత దేశంలో పలు ప్రధాన 16 నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎయిర్టెల్ తెలిపింది.
కేవలం రూ.49 చెల్లించి సిమ్ కార్డును ఆర్డర్ చేయవచ్చు. సదరు నెంబరును ఆధార్ కేవైసీ ద్వారా యాక్టివేట్ చేయనున్నట్లు ప్రకటించింది.
బ్లింకిట్ కేవలం సిమ్ డెలివరీ సేవలను అందిస్తుందని, వినియోగదారులు సెల్ఫ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయటం ద్వారా సొంతంగా సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోవాలి.