Mar 3, 2020, 5:32 PM IST
‘ఇండియన్ -2’ సినిమా ప్రమాదానికి సంబంధించిన విచారణ కోసం సూపర్ స్టార్ కమల్ హాసన్ మంగళవారం చెన్నై పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు. ఫిబ్రవరి 19 న ‘ఇండియన్ -2’ మూవీ సెట్లో క్రేన్ కూలిపోయి ముగ్గురు మృతి చెందగా, పది మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇండియన్ -2 సినిమాలో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.