కొరియా కంపెనీని విశాఖలో అడుగు పెట్టనివ్వను: జగన్

Feb 17, 2021, 5:48 PM IST

విశాఖ: ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌తో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చర్చలు జరిపింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని కమిటీ తెలిపింది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అడుగు పెట్టనివ్వని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. పోస్కో పరిశ్రమను భావనాపాడు, కడప, కృష్ణపట్నంలో ఏర్పాటు చేస్తామని తెలిపారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదని కార్మిక సంఘం తెలిపింది.