ప్రపంచంలోనే ఇండియాది అత్యుత్తమ డిజిటల్ ఆర్ధిక వ్యవస్ధ : నోబెల్ పురస్కార గ్రహీత ప్రశంసలు

By Siva KodatiFirst Published Feb 13, 2024, 3:14 PM IST
Highlights

భారతదేశం ప్రస్తుతం అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న ఆర్ధిక వ్యవస్ధ అన్నారు నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్ధికవేత్త ఏ. మైఖేల్ స్పెన్స్. 2001లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన స్పెన్స్ సోమవారం గ్రేటర్ నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీ విద్యార్ధులు, అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

భారతదేశం ప్రస్తుతం అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న ఆర్ధిక వ్యవస్ధ అన్నారు నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్ధికవేత్త ఏ. మైఖేల్ స్పెన్స్. భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ ఆర్ధిక వ్యవస్ధ, ఫైనాన్స్ ఆర్కిటెక్చర్ ద్వారా విజయవంతంగా అభివృద్ధి చెందిందని ఆయన ప్రశంసించారు. 2001లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన స్పెన్స్ సోమవారం గ్రేటర్ నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీ విద్యార్ధులు, అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచం.. ఆర్ధిక వ్యవస్ధలో ఒక రకమైన పాలనా మార్పును అనుభవిస్తోందని స్పెన్స్ పేర్కొన్నారు. 

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ పరిణామాన్ని మైఖేల్ వివరిస్తూ.. కోవిడ్ మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాతావరణ మార్పులు మొదలైన వాటి కారణంగా ప్రపంచ వ్యవస్ధ విచ్చిన్నమవుతోందన్నారు. గ్లోబల్ సిస్టమ్.. సమర్ధత, తులనాత్మక ప్రయోజన పరిగణనల చుట్టూ కేంద్రీకృతమై వున్న గ్లోబల్ సప్లయ్ చైన్ వంటి ఆర్ధిక ప్రమాణాలపై నిర్మించబడిందని నొక్కిచెప్పారు. గురుత్వాకర్షణ కేంద్రం క్రమంగా తూర్పు వైపుకు మారడంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ప్రాథమిక మార్పు కనిపిస్తోందని మైఖేల్ పేర్కొన్నారు. దీని ద్వారా సప్లయ్ గొలుసులు వైవిధ్యంగా మారుతున్నాయని, ప్రపంచ పాలన గతంలో కంటే మరింత క్లిష్టంగా మారుతోందని ఆయన వెల్లడించారు. 

సవాలుతో కూడుకున్న సమయం వున్నప్పటికీ, మానవ సంక్షేమాన్ని పెంపొందించడానికి మనకు ప్రతిఘటనలు వున్నాయా అనే ప్రశ్నకు నిశ్చయాత్మక సమాధానమే ఆశావాదాన్ని ఇస్తుందని మైఖేల్ వివరించారు. ఏఐ ఉత్పాదకత, బయోమెడికల్ లైఫ్ సెన్సెస్‌లో విప్లవాలు, భారీ శక్తి పరివర్తనలతో సహా మానవ సంక్షేమాన్ని పెంపొందించడానికి దోహదపడే సైన్స్, టెక్నాలజీలో అపారమైన పురోగతిని కూడా ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో సౌర శక్తి పోటీ ధరలను మైఖేల్ ఉదహరించారు. డీఎన్ఏ సీక్వెన్సింగ్ ఖర్చు గతంలో 10 మిలియన్ డాలర్ల నుంచి 250 డాలర్లకు తగ్గిందని ఆయన చెప్పారు. సాంకేతిక వృద్ధికి ప్రతికూలతలు వున్నాయని మైఖేల్ తెలిపారు. 

మనం నమ్మశక్యం కాని శక్తివంతమైన శాస్త్రీయ, సాంకేతిక సాధనాలను కలిగి వున్నామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుంటే విస్తృత శ్రేణిలో ప్రజలకు శ్రేయస్సు, అవకాశాలను అందించడానికి ఉపయోగపడుతుందని స్పెన్స్ అభిప్రాయపడ్డారు. అసమాన సమాచారంతో మార్కెట్లను విశ్లేషించినందుకు మైఖేల్ గుర్తింపు తెచ్చుకున్నారు. 

click me!