సవరించిన పౌరసత్వ చట్టం వచ్చే నెల నుంచి అమల్లోకి..!

Published : Feb 27, 2024, 06:17 PM ISTUpdated : Feb 27, 2024, 06:35 PM IST
సవరించిన పౌరసత్వ చట్టం వచ్చే నెల నుంచి అమల్లోకి..!

సారాంశం

సవరించిన పౌరసత్వ చట్టాన్ని వచ్చే నెల నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కొన్ని విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని తెలిపాయి.  

పౌరసత్వ చట్టంలో సవరణలు తేవడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. 2019లో పార్లమెంటు ఈ పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. వచ్చే నెల నుంచి ఈ సవరించిన పౌరసత్వ చట్టాన్ని అమల్లోకి తేనున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

2019లో పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ కొత్త చట్టం భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి తొలిసారి మతాన్ని కూడా పేర్కొంది. తద్వార ముస్లిం మెజార్టీగా ఉన్న పొరుగు దేశాల్లో మత పీడన ఎదుర్కొని శరణార్థులుగా మన దేశానికి వచ్చిన వారికి ఉపశమనం లభిస్తుందని భారత ప్రభుత్వం భావించింది. 

అయితే.. ఈ సవరణ ముస్లింలపై వివక్ష చూపుతుందని, భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి అయినా లైకిక విధాననికి విఘాతాన్ని కలిగిస్తుందని విమర్శలు వాదించారు.

Also Read: Medaram Jathara: మేడారం జాతరలో ఎన్ని హుండీలు నిండాయి? అవి ఎవరికి చెందుతాయి?

పౌరసత్వ సవరణ చట్టానికి ముందుగా లాంగ్ టర్మ్ వీసాలను ఆమోదించే అధికారాన్నిజిల్లా అధికారులకు ఇప్పటికే అప్పగించారు. గత రెండేళ్లలో సుమారు 30 జిల్లాల్ల మెజిస్ట్రేట్‌లు, తొమ్మిది రాష్ట్రాల హోం సెక్రెటరీలకు ఈ పౌరసత్వాన్ని ప్రసాదించే అధికారాలను ఇవ్వబడ్డాయి. ఈ చట్టం కింద పొరుగునే ఉన్న ముస్లిం దేశాలైన అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోని నాన్ ముస్లిం మైనార్టీలకు వీరు పౌరసత్వం అందించారు. 

ఈ మూడు దేశాల నుంచి వచ్చిన మొత్తం 1,414 నాన్ ముస్లిం మైనార్టీలకు ఏప్రిల్ 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 మధ్య కాలంలో భారత పౌరసత్వాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా లేదా నాచురైలేజషన్ కింద అందించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం