పార్లమెంటులో బడ్జెట్‌ 2021-22ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్..

By S Ashok KumarFirst Published Feb 1, 2021, 11:08 AM IST
Highlights

. కరోనా వైరస్ మహమ్మారిని కారణంగా ఈ సారి బడ్జెట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. అలాగే సామాన్యులకు ఉపాధి, పన్ను రాయితీలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రభుత్వం నుండి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. 

భరత దేశ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1 అంటే నేడు సోమవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  మరికాసేపట్లో  సమర్పించనున్నారు. కరోనా వైరస్ మహమ్మారిని కారణంగా ఈ సారి బడ్జెట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. అలాగే సామాన్యులకు ఉపాధి, పన్ను రాయితీలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రభుత్వం నుండి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఇది కాకుండా, విద్య, ఆరోగ్యం, రక్షణకు సంబంధించి కూడా ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చు అని ఆశిస్తున్నారు. ఆ 

ఆర్థిక వ్యవస్థలో వి- ఆకారపు రికవరీ ఉంటుంది
టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ, "కరోనా  కాలంలో మేము ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాము." స్థానికరణ, డిజిటలైజేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా మొత్తం ఆటో రంగాన్ని బలోపేతం చేశారు. 2021 లో ఆర్థిక వ్యవస్థ వి- ఆకారపు రికవరీని సాధిస్తుందని మేము ఆశిస్తున్నాము, ఇది పరిశ్రమను తిరిగి ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.

గృహ రుణం చెల్లింపుపై పన్ను మినహాయింపు
గృహ అమ్మకాలను పెంచడానికి రాబోయే బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిధిని పెంచాలని రియాల్టీ కంపెనీల సంస్థ క్రెడాయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనితో పాటు, గృహ రుణ చెల్లింపుపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచాలని సూచించింది.

కోవిడ్ 19 కారణంగా ఆటో రంగం చాలా నష్టపోయింది. అటువంటి పరిస్థితిలో, రాబోయే బడ్జెట్ నుండి ఆటో రంగానికి అధిక అంచనాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెడుతున్నందున ఇది ఉపశమనం పొందుతుందని భావిస్తున్నారు. 

also read నేడే యూనియన్ బడ్జెట్‌ 2021-22.. ఊ. 11 గంటలకు పార్లమెంటులో సమర్పించనున్న ఆర్థిక మంత్రి.. ...

బడ్జెట్ ముందు సోమవారం స్టాక్ మార్కెట్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు పెరిగి 46,617.95 వద్ద ఉండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 13,758.60 వద్ద ఉంది.

ఒక నివేదిక ప్రకారం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని సుమారు రూ .19 లక్షల కోట్లకు పెంచవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ రుణ లక్ష్యాన్ని నిర్దేశించింది.

2021 లో భారతదేశ ఆర్థిక వృద్ధి 11.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కరోనా వైరస్ మహమ్మారి మధ్య ఉన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఏకైక దేశం, ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు రెండంకెలలో ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

ఈ సారీ  'లెడ్జర్'కు బదులుగా మేడ్ ఇన్ ఇండియన్ టాబ్లెట్ ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పింనున్నారు. ఈ బడ్జెట్ చాలా ముఖ్యం ఎందుకంటే ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. కాబట్టి ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి ఆర్థిక మంత్రి ఏమి ప్రకటిస్తున్నారో చూడాలి.  

click me!