ప్రియుడిని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్: నిందితుల కోసం పోలీసుల వేట

By telugu teamFirst Published Jun 21, 2021, 10:15 AM IST
Highlights

యువకుడిని చెట్టుకు కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో పోలీసులు నిందితుల కోసం రెండు జిల్లాల్లో వేట కొనసాగిస్తున్నారు. బాధితుడిని వెంట పెట్టుకుని నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో గల సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రేమ జంటపై జరిగిన అఘాయిత్యం కేసులో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రియుడిని చెట్టుకు కట్టేసి నలుగురు దుండగులు యువతిపై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. 

ప్రకాశం బ్యారేజీ దిగువ భాగాన మహానాడు సమీపంలోని రైల్వే వంతెన కింద నిందితులు యువతిపై సామూహిక అత్యాచారం చేసి నాటు పడవపై విజయవాడ వైపు వెళ్లినట్లు బాధితులు తెలిపారు. అప్పటికే చీకటి పడడంతో నిందితులను గుర్తించడం వారికి కష్టమైందని పోలీసులు చెబుతున్నారు. 

Also Read: గుంటూరు జిల్లాలో దారుణం:ప్రియుడిని కట్టేసి యుతిపై గ్యాంగ్ రేప్

యువతితో పాటు యువకుడిని పోలీసులు తమ వెంట తీసుకుని వెళ్లి రెండు జిల్లాల్లోని అనుమానితులను చూపిస్తున్నారు నిందితులను గుర్తించాలని అతన్ని అడుగుతున్నారు గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ ఈశ్వర రావు, ఉత్తర మండలం డీఎస్పీ దుర్గాప్రసాద్, విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏసీపీ రమణమూర్తులతో కూడిన బృందం సంయుక్తంగా ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆదివారం సాయంత్రం పరిశీలించారు 

ఎస్ఐలు వినోద్ కుమార్, నారాయణ, బాలకృష్ణ వేర్వేరు బృందాలుగా ఏర్పడి కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు విజయవాడ వ ైపు కృష్ణానదిలో ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని ఎస్సైలు వెంటాడి పట్టుకుని ప్రస్నించారు. వారిని బాధితునికి చూపించారు. అయితే, నేరం చేసింది వారు కాదని అతను చెప్పాడు. 

యువతిపై సామూహిక అత్యాచారం చేసినవారు బ్లేడ్ బ్యాచ్ కు చెందినవారా అనే కోణంలోనే కాకుండా వారు గంజాయి సేవించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు 

click me!