Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో దారుణం:ప్రియుడిని కట్టేసి యుతిపై గ్యాంగ్ రేప్

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. ప్రేమ జంటపై దాడి చేసి యువతిపై కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారు.  ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది

woman gang raped in Andhra pradeshs Guntur district lns
Author
Guntur, First Published Jun 20, 2021, 12:56 PM IST

అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. ప్రేమ జంటపై దాడి చేసి యువతిపై కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారు.  ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది.  తాడేపల్లి మండం పరిధిలోని సీతానగరంలో గల పుష్కరఘాట్  వద్ద ప్రేమికులపై నలుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు. ప్రియుడిపై దాడి చేశారు. ప్రియుడిని తాళ్లతో కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.  

యువతిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు పడవపై విజయవాడ వైపు వెళ్లినట్టుగా బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  అత్యాచారానికి గురైన యువతిని పోలీసులు పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  బ్లేడ్ బ్యాచ్ ఈ దారుణానికి ఒడిగట్టిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు నలుగురు అనుమానితులను పోలీసులు  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios