గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో : ‘‘ మీ వాళ్లు చేయలేదా ’’ .. కుప్పంలో టీడీపీ నిరసనను అడ్డుకున్న సీఐ

By Siva KodatiFirst Published Aug 6, 2022, 8:42 PM IST
Highlights

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల నిరసనను అడ్డుకునే సందర్భంలో అర్బన్ సీఐ ఓవరాక్షన్ చేశారు. వైసీపీ ఎంపీ మాధవ్‌పై చర్యలు కోరుతూ కుప్పంలో తెలుగు యువత నిరసనలకు సీఐ శ్రీధర్ అడ్డు తగిలారు. సీఐ శ్రీధర్, ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులని తెలుస్తోంది.
 

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల నిరసనను అడ్డుకునే సందర్భంలో అర్బన్ సీఐ ఓవరాక్షన్ చేశారు. ఇదేమి కొత్త కాదని.. ఇలాంటి వాళ్లు దండిగా వుంటారని గోరంట్లకు మద్ధతుగా మాట్లాడారు. మీవాళ్లు ఇలా చేయ్యలేదా అంటూ అడ్డంగా వాదించారు సీఐ. దేశాన్ని కాల్చండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ యూనిఫాంలో వుండి దేశాన్ని కాల్చండి అంటూ సీఐ వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ అభ్యంతరం చెప్పింది. సీఐ శ్రీధర్, ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులని తెలుస్తోంది. తన స్నేహితుడిని వెనకేసుకుని వచ్చే ప్రయత్నంలో సీఐ రుసరుసలాడారు. వైసీపీ ఎంపీ మాధవ్‌పై చర్యలు కోరుతూ కుప్పంలో తెలుగు యువత నిరసనలకు సీఐ శ్రీధర్ అడ్డు తగిలారు. దిష్టి బొమ్మ తగులబెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు. 

మరోవైపు.. వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంపై ఏపీ మహిళా కమీషన్ (ap women's commission) సీరియస్ అయ్యింది. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది. ఈ ఘటనలో త్వరగా నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీని కోరారు ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. మరోవైపు.. గోరంట్ల మాధవ్ తీరుపై ప్రతిపక్షాలతో పాటు మహిళా, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. ఏపీ వ్యాప్తంగా గత రెండ్రోజులుగా నిరసనకు దిగాయి. విశాఖలో తెలుగుదేశం మహిళా నేతలు గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అటు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పుట్టపర్తిలోని సత్యమ్మ గుడి వద్ద గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఎంపీ మాధవ్ దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ.. ఆయనను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. 

ALso REad:వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో.. నిజాలు నిగ్గుతేల్చండి : డీజీపీకి ఏపీ మహిళా కమీషన్ లేఖ

కాగా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆశ్లీల వీడియో వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని హిందూపురం ఎంపీ Gorantla Madhav ఆరోపించారు.  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్న Obscene videoపై గురువారం నాడు స్పందించారు.  Morphing  చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మాధవ్ ఆరోపించారు.  ఈ వీడియో విషయమై ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని ప్రకటించారు. ఈ విషయమై ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మాధవ్ వివరించారు.  ఈ కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణలున్నారని ఆయన ఆరోపించారు. తనపై కుట్ర పన్నిన ముగ్గురిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు.

click me!