ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ కుమారుడు జాన్ మహేంద్రన్ దర్శకత్వంలో 2005లో వచ్చిన సినిమా `సచిన్`.
వి క్రియేషన్స్ పతాకంపై కళైపులి ఎస్ ధాను నిర్మించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
విజయ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా నటించారు. బిపాషా బసు, వడివేలు, సంతానం, రఘువరన్, తలైవాసల్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
కాలేజీలో హీరో హీరోయిన్ ని చూసి ప్రేమిస్తాడు. 30 రోజుల ఛాలెంజ్ లో హీరో గెలుస్తాడా లేదా అనేది కథ.
విజయ్ కాలేజ్ స్టూడెంట్ గా అదరగొట్టాడు. అతని పాత్ర అందరినీ ఆకట్టుకుంది.
జెనీలియా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. శాలిని పాత్రలో చక్కగా నటించింది.
వడివేలు, సంతానం కామెడీ సినిమాకి బలం చేకూర్చింది.
2005లో సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా, మంచి వసూళ్లు సాధించింది. టీవీల్లో ప్రసారమైన తర్వాత మరింతగా గుర్తింపు పొందింది.
20 ఏళ్ళ తర్వాత `సచిన్` రీ-రిలీజ్ అయింది. అభిమానులు సినిమాని బాగా ఆదరిస్తున్నారు.
సినిమా కొన్ని చోట్ల నెమ్మదిగా ఉండటం, పాత కథలా అనిపించడం వల్ల సినిమా అంతగా ఆడలేదు.
గతేడాది గిల్లి రీ-రిలీజ్ 36 కోట్లు వసూలు చేసింది. `సచిన్` రీ-రిలీజ్ ఆ రికార్డ్ ని బద్దలు కొడుతుందో లేదో చూడాలి.