Entertainment
నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయన్ గా పేరు తెచ్చుకున్నారు.
జాన్వీ కపూర్ ఇటీవలి ఇంటర్వ్యూలో ఋతుక్రమం గురించి మాట్లాడారు.
ఋతుక్రమం వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్ ని పురుషులు అనుభవించే వరకు వారికి ఋతుక్రమ నొప్పి అర్థం కాదు అన్నారు.
ఖచ్చితంగా చెప్తున్నా, పురుషులు ఋతుక్రమ నొప్పిని, మూడ్ స్వింగ్స్ ని ఒక్క నిమిషం కూడా తట్టుకోలేరు.
పురుషులకు ఋతుక్రమం వస్తే అణుయుద్ధం జరిగే అవకాశం ఉందని జాన్వీ కపూర్ అన్నారు.
జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై చాలా మంది మహిళలు ఇది నూటికి నూరుపాళ్ళు నిజమే అన్నారు.
దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జాన్వీ కపూర్, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తున్నారు.