ముంబైలో జరిగిన వేవ్స్ సదస్సులో రజినీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
వేవ్స్ సదస్సులో మాట్లాడిన రజినీకాంత్ ప్రధాని మోడీని ప్రశంసించారు.
ప్రధాని మోడీ కాశ్మీర్లో శాంతిని తిరిగి నెలకొల్పుతారని రజినీ విశ్వాసం వ్యక్తం చేశారు.
తన జీవితంలో అనేక సవాళ్లను సమర్థవంతంగా, దూరదృష్టితో ఎదుర్కొని విజయం సాధించిన మోడీ ఒక పోరాట యోధుడని రజినీ అన్నారు.
దేశీయ సమస్యలే కాదు అంతర్జాతీయ సమస్యలను కూడా మోడీ సమర్థవంతంగా పరిష్కరించారని రజినీ అన్నారు.
పహల్గాం దాడికి మోడీ సరైన ప్రతీకారం తీర్చుకుంటారనే నమ్మకం ఉందని రజినీ అన్నారు.
కాశ్మీర్ ఉగ్రవాద దాడి అనాగరికమైనదని, క్రూరమైన చర్య అని రజినీ ఖండించారు.