Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా... టెస్టింగ్ సెంటర్లకు పరుగుతీస్తున్న ప్రజలు

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కరోనా టెస్టుల సంఖ్య పెంచారు. ఈ క్రమంలోనే విజయవాడ నగరంలో కోవిడ్ టెస్టింగ్ సెంటర్లను పెంచారు. నగర వ్యాప్తంగా పిహెచ్సి సెంటర్లతో పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితంగా ఆర్టిపిసిఆర్ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన ల్యాబ్ లో కూడా ఆర్టిపిసిఆర్ టెస్టులను రూ.350 కె చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అసలే చలికాలం కావడంతో ఎక్కువమంది ప్రజలు దగ్గు జలుబు తో బాధపడుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అనేకమంది టెస్టింగ్ సెంటర్లకు పరిగెడుతుండటంతో అక్కడ రద్దీ పెరిగింది. 

Video Top Stories