Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 683 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో 13,674 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 168 కేసులు నమోదయ్యాయి.  

683 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Feb 12, 2022, 10:17 PM IST

తెలంగాణలో కరోనా కేసులు (corona casse in telangana) తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 52,714 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 683 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 7,83,019కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. మహమ్మారి బారి నుంచి నిన్న 2,645 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 13,674 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 168 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 24, జీహెచ్ఎంసీ 168, జగిత్యాల 18, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల 2, కామారెడ్డి 11, కరీంనగర్ 25, ఖమ్మం 36, మహబూబ్‌నగర్ 21, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 9, మంచిర్యాల 24, మెదక్ 8, మేడ్చల్ మల్కాజిగిరి 537, ములుగు 6, నాగర్ కర్నూల్ 7, నల్గగొండ 46, నారాయణపేట 3, నిర్మల్ 12, నిజామాబాద్ 16, పెద్దపల్లి 19, సిరిసిల్ల 10, రంగారెడ్డి 44, సిద్దిపేట 14, సంగారెడ్డి 22, సూర్యాపేట 14, వికారాబాద్ 8, వనపర్తి 6, వరంగల్ రూరల్ 8, హనుమకొండ 22, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో క‌రోనా కొత్త కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌గా.. మ‌ర‌ణాలు మ‌ళ్లీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త న‌మోదైన క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గ‌గ‌, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి.  కొత్తగా50,407 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో  దేశంలో క‌రోనా బారిన‌ప‌డ్డ వారి సంఖ్య మొత్తం 4,25,86,544కు పెరిగింది. ఇదే స‌మ‌యంలో 1,36,962 (RECOVERED) మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రిక‌వ‌రీల సంఖ్య 4,14,68,120 కి పెరిగింది. ప్ర‌స్తుతం 6,10,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గ‌త 24 గంటల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 804 మంది ప్రాణాలు కోల్పోయారు. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే.. మ‌ర‌ణాలు పెరిగాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 5,07,981 మంది కరోనా వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.2 శాతంగా ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 1.19 శాతంగా ఉంది. క‌రోనా పాజిటివిటీ రేటు 5.8 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. మ‌హారాష్ట్రలో అత్య‌ధికంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 78,35,088 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అలాగే, 1,43,355 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా కేర‌ళ‌లో న‌మోద‌య్యాయి. కొత్త‌గా కేర‌ళ‌లో 16,012 కేసులు, 492 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios