Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కరోనా కేసుల పరిస్ధితి ఇది.. కొత్తగా ఎంతమందికి పాజిటివ్ అంటే.. ?

తెలంగాణలో కరోనా (corona cases in telangana) వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,417 నమూనాలను పరిశీలించగా.. 2,421 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,71,828కి చేరింది. 

2421 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Feb 3, 2022, 10:11 PM IST

తెలంగాణలో కరోనా (corona cases in telangana) వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,417 నమూనాలను పరిశీలించగా.. 2,421 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,71,828కి చేరింది. వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనా వల్ల తెలంగాణలో (corona deaths in telangana) మరణించిన వారి సంఖ్య 4,096కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,104 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. రికవరీ రేటు 95.18గా ఉన్నట్లు సర్కార్ పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 649 మందికి పాజిటివ్‌గా తేలింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 50, భద్రాద్రి కొత్తగూడెం 80, జీహెచ్ఎంసీ 649, జగిత్యాల 49, జనగామ 57, జయశంకర్ భూపాలపల్లి 19, గద్వాల 14, కామారెడ్డి 34, కరీంనగర్ 80, ఖమ్మం 83, మహబూబ్‌నగర్ 72, ఆసిఫాబాద్ 13, మహబూబాబాద్ 50, మంచిర్యాల 64, మెదక్ 52, మేడ్చల్ మల్కాజిగిరి 144, ములుగు 20, నాగర్ కర్నూల్ 48, నల్గగొండ 100, నారాయణపేట 16, నిర్మల్ 55, నిజామాబాద్ 47, పెద్దపల్లి 36, సిరిసిల్ల 51, రంగారెడ్డి 114, సిద్దిపేట 58, సంగారెడ్డి 57, సూర్యాపేట 58, వికారాబాద్ 30, వనపర్తి 31, వరంగల్ రూరల్ 33, హనుమకొండ 106, యాదాద్రి భువనగిరిలో 51 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

మరోవైపు దేశంలో కరోనా కేసులు (Corona Cases) స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా  1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసులు 6.8 శాతం పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,008 కరోనా మరణాలు (Corona Deaths) చోటుచేసుకున్నాయి. ఇందులో కేరళకు చెందిన 355 బ్యాక్ లాగ్ మరణాల గణంకాలు కూడా ఉన్నాయి. తాజా మరణాలతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,98,983కి చేరింది. తాజాగా దేశంలో కరోనా నుంచి 2,59,107 కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,97,70,414కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15,33,921గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 

ఇక, దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 12.98 శాతంకు చేరింది. దేశంలో కరోనా రికవరీ రేటు 95.14 శాతం, మరణాల రేటు 1.19 శాతం, యాక్టివ్ కేసులు 3.67 శాతంగా ఉన్నాయి. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 55,10,693 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,67,87,93,137కి చేరింది. దేశంలో బుధవారం (ఫిబ్రవరి 2) రోజున 15,69,449 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 73,41,92,614 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios