Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం.. 24 గంటల్లో 1061 మందికి పాజిటివ్

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,061 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.  ప్రస్తుతం తెలంగాణలో 21,470 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా ఇవాళ 274 కేసులు నమోదయ్యాయి.  

1061 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Feb 8, 2022, 9:23 PM IST

తెలంగాణలో కరోనా కేసులు (corona cases in telangana) భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 69,892 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,061 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,79,971కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో (corona deaths in telangana) కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 4,102కి చేరింది. కోవిడ్ నుంచి నిన్న 3,590 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 21,470 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా ఇవాళ 274 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 38, జీహెచ్ఎంసీ 274, జగిత్యాల 31, జనగామ 15, జయశంకర్ భూపాలపల్లి 5, గద్వాల 3, కామారెడ్డి 20, కరీంనగర్ 32, ఖమ్మం 38, మహబూబ్‌నగర్ 23, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 13, మంచిర్యాల 19, మెదక్ 20, మేడ్చల్ మల్కాజిగిరి 78, ములుగు 10, నాగర్ కర్నూల్ 11, నల్గగొండ 45, నారాయణపేట 7, నిర్మల్ 19, నిజామాబాద్ 27, పెద్దపల్లి 20, సిరిసిల్ల 14, రంగారెడ్డి 78, సిద్దిపేట 42, సంగారెడ్డి 40, సూర్యాపేట 34, వికారాబాద్ 13, వనపర్తి 11, వరంగల్ రూరల్ 9, హనుమకొండ 29, యాదాద్రి భువనగిరిలో 29 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుండ‌గా, దేశంలో నిత్యం ల‌క్ష‌కు పైగా క‌రోనా కేసులు (Coronavirus) న‌మోద‌వుతున్నాయి. అయితే, ఈ వారం ప్రారంభం నుంచి కోవిడ్‌-19 కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో కొత్తగా రోజువారీ కేసులు లక్ష దిగువ‌ర‌కు ప‌డిపోయాయి. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 67,597 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,23,39,611 కు చేరింది. Coronavirus యాక్టివ్ కేసులు సైతం ప‌దిల‌క్ష‌ల దిగువ‌కు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం 9,94,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో క‌రోనా వైరస్ నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. దీంతో క‌రోనా  (Coronavirus)రిక‌వ‌రీల సంఖ్య 4,08,40,658 కి పెరిగింది. 

దేశంలో కోవిడ్ కేసులు  (Coronavirus) త‌గ్గుతున్న‌ప్ప‌టికీ మ‌ర‌ణాలు మాత్రం నిత్యం వేయికి పైగానే న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో  క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 1188 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా కార‌ణంగా భార‌త్ లో చ‌నిపోయిన వారి సంఖ్య 5,04,062ల‌కు చేరుకుంది. కోవిడ్మ‌-19 మ‌ర‌ణాలు రేటు 1.19 శాతంగా ఉంది. రిక‌వ‌రీ రేటు 96.2 శాతంగా ఉంది. క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 9.1 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనా (Coronavirus) కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. 

క‌రోనా (Coronavirus) నియంత్ర‌ణ కోసం కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్ప‌టివర‌కు దేశంలో మొత్తం 170.2 కోట్ల కోవిడ్‌-19 టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 90.1 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 72.8 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం74,15,61,587 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) వెల్ల‌డించింది. సోమ‌వారం ఒక్క‌రోజే 11,56,363 కోవిడ్‌-19  (Coronavirus) శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios