Asianet News TeluguAsianet News Telugu

అందమైన అమ్మాయిలతో మసాజ్ కు ఆశపడి, చివరకు.....

అందమైన యువతులతో మసాజ్ చేయించుకుందామని ఆశపడిన ఓ భారతీయుడికి దుబాయ్ లో చుక్కెదురైంది. నలుగురు నైజీరియా మహిళలు అతన్ని బంధించి, డబ్బులు దోచుకున్నారు.

Indian robbed Rs 55 lakhs in Dubai with cheating
Author
Dubai - United Arab Emirates, First Published Feb 22, 2021, 7:28 AM IST

దుబాయ్: అందమైన అమ్మాయిలతో మసాజ్ చేయించుకోవాలని ఆశపడి ఓ వ్యక్తి ఏకంగా రూ.55 లక్షలు పోగొట్టుకున్నాడు. అందమైన అమ్మాయిలు ఉన్న ఓ యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అతను 55 లక్షలు రూపాయలు పోగొట్టుకున్నాడు.  ఈసంఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. భారత్ నుంచి ఇక్కడికి వచ్చిన ఓ యువకుడు ఈ మోసానికి గురయ్యాడు.

ఈ విషయాన్ని దుబాయ్ లోని కోర్టుకు విచారణను ఉటంకిస్తూ ఇక్కడి మీడియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. కోర్టు వివరాల ప్రకారం.. ఓ యాప్ లో అందమైన అమ్మాయిలను చూపిస్తూ మసాజ్ కావాలంటే.. అంటూ ఓ నంబరు ఇచ్చారు. మసాజ్ కు కేవలం రూ.3,950 మాత్రమేనని ఆ యాడ్ లో చెప్పారు. ఆ యాడ్ పై భారత్ కు చెందిన ఓ యువకుడు క్లిక్ చేశాడు. 

నిరుడు నవంబర్ లో మసాజ్ కోసం ఆ వ్యక్తిని ఆల్ రెఫా అనే ప్రాంతంలోకి రావాల్సిందిగా కోరారు. దాంతో అతను అక్కడికి వెళ్లాడు. ఆ తర్వాత నైజీరియాకు చెందిన నలుగురు మహిళలు అతన్ని బంధించారు. మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ బ్యాంక్ వివరాలు చెప్పాలని బెదిరించారు. 

అతను భయంతో వివరాలు చెపపాడు. క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతాల ద్వారా రూ.55,30,806 దోచుకున్నారు. ఆ తర్వాత అతని ఐఫోన్ లాక్కుని విడుదలు చేశారు. ఆ తర్ావత పోలీసులకు, బ్యాంకుకు విషయాన్ని తెలిపినట్లు బాధితుడు కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో ముగ్గురు నైజీరియా మహిళలను అరె్సటు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios