Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ఐసీయూలోని యువతికి మత్తుమందు ఇచ్చి, ఆపై .. .. 

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలో చేరిన మహిళా రోగిపై అత్యాచారం చేసిన ఉదంతం రాజస్థాన్‌లోని అల్వార్‌లో వెలుగు చూసింది.
 

Nursing staff rapes ICU patient in Rajasthan KRJ
Author
First Published Feb 28, 2024, 12:02 AM IST

Rajasthan: దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఏదోక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అల్వార్ జిల్లా  శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరీష్ ఆసుపత్రి ఐసియులో  చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉపిరితిత్తలు ఇన్ఫెక్షన్ కారణంగా సదరు యువతి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిరాగ్ యాదవ్ అనే నర్సింగ్ స్టాప్ తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయం ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ ద్వారా నిందితుడు మహిళపై అత్యాచారం చేసినట్టు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
ఉపిరితిత్తలు ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన సదరు యువతి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు చిరాగ్ యాదవ్ తనకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడని యువతి ఆరోపించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. యువతి మొబైల్‌కి ఆమె భర్త కాల్ చేయడంతో స్పృహలోకి వచ్చిందని, ఆ తర్వాత ఆమెపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు వివరించిందని పోలీసులు చెప్పారు. 

ఆసుపత్రి యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా ఆస్పత్రి సిబ్బంది, యాజమాన్యం బెదిరించారని బాధిత మహిళ ఆరోపించింది.హాస్పిటల్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీతోపాటు ఇతర సమాచారాన్ని పోలీసులకు అందజేస్తామని ఆస్పత్రి డైరెక్టర్ లవేష్ గుప్తా తెలిపారు. స్వయంగా నిందితుడైన ఉద్యోగిని పోలీసులకు అప్పగించింది. ఆసుపత్రి యంత్రాంగం పోలీసులకు పూర్తిగా సహకరిస్తోంది.
 
విచారణ కొనసాగుతోంది

ఈ సందర్భంగా శివాజీ పార్క్ SHO రాజ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. బరోడా మియో పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఆసుపత్రిలోని ఐసియులో చేర్చబడింది. అర్ధరాత్రి ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది తనపై అత్యాచారం చేశారని మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అలాగే ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios