Asianet News TeluguAsianet News Telugu

Coronavirus:కేర‌ళ‌, మిజోరం రాష్ట్రాల్లో కొన‌సాగుతున్న క‌రోనా ప్ర‌భావం !

Coronavirus: దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. అయితే, ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండగా, మ‌రికొన్ని రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం పెరుగుతున్న‌ది. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రమైన కేర‌ళ‌, ఈశాన్య భార‌త రాష్ట్రమైన మిజోరంలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క‌రోనా కొత్త కేసులు, పాజిటివ్ రేటు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ద‌ని ప్ర‌స్తుత గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి.
 

Kerala Mizoram still seeing surge in Covid cases
Author
Hyderabad, First Published Feb 3, 2022, 7:52 PM IST

Coronavirus: దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. అయితే, ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండగా, మ‌రికొన్ని రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం పెరుగుతున్న‌ది. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రమైన కేర‌ళ‌, ఈశాన్య భార‌త రాష్ట్రమైన మిజోరంలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క‌రోనా కొత్త కేసులు, పాజిటివ్ రేటు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ద‌ని ప్ర‌స్తుత గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. 297 జిల్లాలు ఇప్పుడు కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉన్నట్లు నివేదించాయి. తొమ్మిది రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు ఇప్పటికీ  భౌతిక త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌డం లేద‌ని కేంద్రం పేర్కొంది. 

50,000 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్న ఎనిమిది రాష్ట్రాల్లో కేరళ ఒక్కటేనని, కొత్త ఇన్‌ఫెక్షన్ కేసులు పెరిగాయనీ, పాజిటివిటీ రేటు సైతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 24 శాతం కేరళలోనే ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. కొత్త కేసులు, పాజిటివిటీ రేటులో డేటా గ‌మ‌నిస్తే.. పెరుగుద‌ల‌ను  న‌మోదుచేస్తున్న రెండో రాష్ట్ర మిజోరం. గురువారం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర, క‌ర్నాట‌క‌, తమిళనాడుతో సహా 34 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్ర‌స్తుతం క‌రోనా కొత్త కేసులు, కోవిడ్‌-19 సానుకూలత రేటులో క్షీణతను నమోదు అవుతున్న‌ద‌ని తెలిపారు. "రోజువారీ యాక్టివ్ కోవిడ్-19 కేసులలో స్థిరమైన క్షీణత, రోజువారీ సానుకూలత రేటు సంక్రమణ వ్యాప్తి తగ్గిందని సూచిస్తుంది" అని లావ్ అగర్వాల్ అన్నారు. టీకా కవరేజ్ పెరుగుదలతో  కోవిడ్‌-19 మరణాల రేటు (CFR) తగ్గుదలని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. జనవరి 26 నాటి 406 జిల్లాలతో పోలిస్తే దేశంలోని 297 జిల్లాలు ఇప్పుడు కోవిడ్-19 పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతున్నాయని పేర్కొంటున్నారు. 

అదేవిధంగా, గత వారం ఈ విభాగంలోని 169 జిల్లాలతో పోలిస్తే ఇప్పుడు 145 జిల్లాలు 5-10 శాతం మధ్య సానుకూలత రేటుతో ఉన్నాయ‌ని తెలిపాయి. కాగా, క‌రోనా థ‌ర్డ్ వేవ్ స‌మ‌యంలో క‌రోనా రోగుల‌లో గొంతు నొప్పి ఒక సాధారణ లక్షణమని లవ్ అగర్వాల్ వెల్లడించారు. అలాగే, ప్ర‌స్తుం క‌రోనా స‌మ‌యంలో చికిత్స‌కు ఉప‌యోగించే మందుల వాడ‌కం కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని తెలిపారు. కోవిడ్‌-19 ఫ‌స్ట్, సెకండ్ వేవ్ లో అధికంగా క‌రోనా ప్ర‌భావానికి గురైన వారి స‌గ‌టు వయస్సు 55 సంవ‌త్స‌రాలుగా ఉండ‌గా, క‌రోనా థ‌ర్డ్ వేవ్ లో వీరి స‌గ‌టు వ‌య‌స్సు 44 ఏళ్లుగా ఉంద‌ని తెలిపారు. అలాగే, 16 రాష్ట్రాలు/యూటీలు 100 శాతం మొదటి డోస్ టీకా కవరేజీని సాధించాయనీ, నాలుగు రాష్ట్రాలు/యూటీలు 96-99 శాతం మధ్య ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హతగల జనాభాలో మొత్తం 76 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్‌ల రెండు డోసులను పొందారని అగర్వాల్ వెల్ల‌డించారు.

అలాగే, దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టింది. ఈ నేప‌థ్యంలోనే దేశంలోని 11 రాష్ట్రాల్లో పాఠ‌శాల‌లు తిరిగి తెర‌వ‌బ‌డ్డాయి. భౌతిక త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నాయ‌ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. అదే సమయంలో, 16 రాష్ట్రాలు/UTలు విద్యా సంస్థలను పాక్షికంగా తిరిగి తెరవడానికి అనుమతించాయి. అయితే  ఇంకా 9 రాష్ట్రాలు/UTలలో భౌతిక తరగతులపై నిషేధం కొన‌సాగుతున్నాయి. "పాఠశాలల్లో 95 శాతం టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి ఇప్పుడు టీకాలు వేయబడ్డాయి. కొన్ని రాష్ట్రాలు 100 శాతం వ్యాక్సినేషన్ కవరేజీని సాధించాయి" అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios