Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా.. తెరుచుకుంటున్న స్కూళ్లు, కాలేజీలు !

Coronavirus: దేశంలో క‌రోనా కొత్త కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే దేశంలోని అనేక రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు ఎత్తివేస్తున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో మూత‌ప‌డిన స్కూల్స్, కాలేజీలు తిరిగి తెరుచుకుంటున్నాయి. 
 

Coronavirus Omicron variant India live updates: All educational institutions from Class 1 to 12 in Goa will reopen
Author
Hyderabad, First Published Feb 18, 2022, 9:51 AM IST

Coronavirus: ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. గ‌త నెల రోజుల నుంచి భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ ప్రభావం కొనసాగుతోంది.  అయితే, ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టింది. రోజువారీ కేసులు 20 వేల ద‌గ్గ‌ర‌కు ప‌డిపోయియి. దీంతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ళ్లీ ఆంక్ష‌లు స‌డ‌లిస్తూ.. తిరిగి అన్ని త‌ర‌గ‌తుల విద్యార్థులకు తిరిగి భౌతిక త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. 

COVID-19 ప్ర‌భావం త‌గ్గిన నేప‌థ్యంలో రాష్ట్రంలో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న అన్ని విద్యా సంస్థలు ఫిబ్రవరి 21 నుండి తిరిగి తెరవబడతాయ‌ని గోవా స‌ర్కారు ప్ర‌క‌టించింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఆఫ్‌లైన్ తరగతులను గురువారం తిరిగి ప్రారంభించింది. కేరళ, గోవా నుండి వచ్చే ప్రయాణీకుల తప్పనిసరి RT-PCR పరీక్షలు అవ‌స‌రం లేద‌ని క‌ర్నాట‌క స‌ర్కారు పేర్కొంది. ఫిబ్రవరి 18 నుండి ఫిబ్రవరి 25 వరకు రాష్ట్రంలోని అహ్మదాబాద్, వడోదరలో మాత్రమే రాత్రి 12 నుండి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంటుందని గుజరాత్ ప్ర‌భుత్వం పేర్కొంది. 

కొత్త‌గా ఎన్నికేసులు న‌మోద‌య్యాయంటే.. 

దేశంలో క‌రోనా కొత్త కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్ట‌గా.. మ‌ర‌ణాలు సైతం త‌గ్గాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్తగా 25,920 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో  దేశంలో క‌రోనా బారిన‌ప‌డ్డ వారి సంఖ్య మొత్తం 4,27,80,235 కు పెరిగింది. ఇదే స‌మ‌యంలో66,254 (RECOVERED) మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రిక‌వ‌రీల సంఖ్య 4,19,77,238 కి పెరిగింది. ప్ర‌స్తుతం 2,92,092 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గ‌త 24 గంటల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 492 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 5,10,905 మంది కరోనా వైర‌స్ కార‌ణంగా మరణించారు. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.0 శాతంగా ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 1.19 శాతంగా ఉంది. క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3.0 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. మ‌హారాష్ట్రలో అత్య‌ధికంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 78,53,291 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అలాగే, 1,43,532 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా కేర‌ళ‌లో న‌మోద‌య్యాయి. 

క‌రోనా (Coronavirus) నియంత్ర‌ణ కోసం కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్ప‌టివర‌కు దేశంలో మొత్తం 174.6 కోట్ల కోవిడ్‌-19 టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 90.7 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 74.9 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 75,55,32,460 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) వెల్ల‌డించింది. గురువారం ఒక్క‌రోజే 11,79,705 కోవిడ్‌-19 (Coronavirus) శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. అయితే, క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో చాలా రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనావైర‌స్ ఆంక్ష‌లు స‌డ‌లిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios