Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Coronavirus: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త న‌మోదైన కరోనా మ‌ర‌ణాల్లో స్వ‌ల్ప పెరుగుద‌ల న‌మోదైంది. కొత్త‌గా 67,084  కేసులు న‌మోదయ్యాయి. అలాగే, 1,241  మంది కరోనా వైర‌స్‌తో మ‌ర‌ణించారు. 
 

Coronavirus LIVE Updates: India Records 67,084 Fresh Cases, Positivity Rate Down To 4.44%
Author
Hyderabad, First Published Feb 10, 2022, 10:08 AM IST

Coronavirus: ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. గ‌త నెల రోజుల నుంచి భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. క‌రోనా (Coronavirus)మ‌హ‌మ్మారి సాధార‌ణ కేసుల‌తో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు మొత్తం దేశంలో నాలుగు కోట్ల మార్కును అందుకున్నాయి. భార‌త్ లో క‌రోనాతో చనిపోయిన వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 5 ల‌క్ష‌ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఐదు ల‌క్ష‌ల మంది పైగా మ‌ర‌ణాలు సంభ‌వించిన మూడో దేశంగా భార‌త్ నిలిచింది. అయితే, ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నెల రోజుల త‌ర్వాత దేశంలో రోజువారీ కేసులు ల‌క్ష దిగువ‌కు ప‌డిపోయాయి. అయితే, మ‌ర‌ణాలు మాత్రం నిత్యం వేయికి పైగానే న‌మోదు అవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్నది. 

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త న‌మోదైన కేసుల్లో స్వ‌ల్ప త‌గ్గుద‌ల న‌మోదైంది.  కొత్తగా 67,084 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో  దేశంలో క‌రోనా బారిన‌ప‌డ్డ వారి సంఖ్య మొత్తం 4,24,78,060 కు పెరిగింది. ఇదే స‌మ‌యంలో1,67,882 (RECOVERED) మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రిక‌వ‌రీల సంఖ్య 4,11,80,751 కి పెరిగింది. ప్ర‌స్తుతం 7,90,789 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గ‌త 24 గంటల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే.. మ‌ర‌ణాలు సైతం స్వ‌ల్పంగా పెరిగాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 5,06,520 మంది కరోనా వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 96.7 శాతంగా ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 1.19 శాతంగా ఉంది. క‌రోనా పాజిటివిటీ రేటు 7.5 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. మ‌హారాష్ట్రలో అత్య‌ధికంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 78,23,385 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అలాగే, 1,43,247 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 

క‌రోనా (Coronavirus) నియంత్ర‌ణ కోసం కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్ప‌టివర‌కు దేశంలో మొత్తం 171.3 కోట్ల కోవిడ్‌-19 టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 90.2 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 73.3 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 74,46,84,750 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) వెల్ల‌డించింది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 15,71,726 కోవిడ్‌-19  (Coronavirus) శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios