Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: కరోనాతో ఐదు లక్ష‌ల మంది మృతి.. కొత్తగా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే..?

Coronavirus: దేశంలో కొత్త‌గా న‌మోదవుతున్న కోవిడ్ కేసులు ఈ వారం ప్రారంభం నుంచి కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే, మ‌ర‌ణాలు మాత్రం క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దేశంలో క‌రోనా కార‌ణంగా మొత్తం ఐదు ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌పంచంలో ఐదు ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించిన మూడో దేశంగా భార‌త్ నిలిచింది. 

corona cases in india:India Crosses 5 Lakh Covid Deaths On Thursday And World 3rd Country
Author
Hyderabad, First Published Feb 4, 2022, 9:54 AM IST

Coronavirus: అన్ని దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. కోవిడ్‌-19 థ‌ర్డ్ వేవ్ అంచ‌నాలు తీవ్ర భయాందోళ‌న క‌లిగిస్తున్నాయి. క‌రోనా (Coronavirus)మ‌హ‌మ్మారి సాధార‌ణ కేసుల‌తో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు మొత్తం దేశంలో నాలుగు కోట్ల మార్కును అందుకున్నాయి. క‌రోనా కేసులు నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతూ వ‌స్తున్నాయి. భార‌త్ లో క‌రోనాతో చనిపోయిన వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 5 ల‌క్ష‌ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఐదు ల‌క్ష‌ల మంది పైగా మ‌ర‌ణాలు సంభ‌వించిన మూడో దేశంగా భార‌త్ నిలిచింది. 

ఇదిలావుండ‌గా, దేశంలో నిత్యం ల‌క్ష‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే, ఈ వారం ప్రారంభం నుంచి కోవిడ్‌-19 కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1,49,394 క‌రోనా కేసులు న‌మోద‌య్య‌యి. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,19,52,712కు చేరింది. కొత్త‌గా 2,46,674 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్ రివ‌క‌రీల సంఖ్య 4,00,17,088కి పెరిగింది. ప్ర‌స్తుతం  14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా వుండ‌గా, దేశంలో కోవిడ్‌-19 కొత్త కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ప్ప‌టికీ.. మ‌ర‌ణాలు క్రమంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. 

గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 1,072 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5,00,055కు పెరిగింది. దేశంలో ప్ర‌స్తుతం రోజువారీ సానుకూలత రేటు 11% నుండి 9.27%కి పడిపోయింది. వీక్లీ క‌రోనా వైర‌స్ పాజిటివిటీ రేటు 12.03%కి తగ్గింది. క‌రోనా నియంత్ర‌ణ కోసం కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్ప‌టివర‌కు దేశంలో మొత్తం 168.5 కోట్ల కోవిడ్‌-19 టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 89.8 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 72.1 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 73,41,92,614 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) వెల్ల‌డించింది. గురువారం ఒక్క‌రోజే 15,69,449 కోవిడ్‌-19 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ మ‌ర‌ణాల రేటు 1.19 శాతంగా ఉంది. 

ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు ఐదు ల‌క్ష‌లు దాటాయి. కరోనా మరణాలు ఐదు లక్షలు దాటిన మూడో దేశంగా భారత్ నిలిచింది. అత్యధికంగా 9.1 లక్షల మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో 6.3 లక్షల మరణాలతో బ్రెజిల్ రెండో స్థానం కొన‌సాగుతోంది. 3.3 లక్షల మరణాలతో రష్యా నాలుగో స్థానంలో, 3.07 లక్షలతో మెక్సికో ఐదో స్థానంలో  ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios