రాఘవేంద్రరావు వల్ల ఆ రోజు టార్చర్.. కారులో వెళ్లిన బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ని బయటపెట్టిన రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి.. రాఘవేంద్రరావు మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే రాఘవేంద్రరావు విషయంలో రాజమౌళికి ఓ బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉందట. తాజాగా అది బయటపెట్టాడు జక్కన్న.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకధీరుడు రాజమౌళి ఎవరికి వారు దర్శక దిగ్గజాలు. ఒకప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు రాఘవేంద్రరావు. ఆయన సినిమాలు ఇప్పుడు వస్తే, ఏ పాన్ ఇండియా సరిపోదు, గ్లోబల్ ఫిల్మ్ లుగా ఆదరణ పొందేవి. వందల కోట్ల కలెక్షన్లని రాబట్టేవి. కానీ రాజమౌళి ఇప్పుడు అలాంటి అద్భుతాలు చేసి ఇండియన్ సినిమా రేంజ్ని పెంచాడు, తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు. మన భారతీయ సినిమా స్థాయిని పెంచే సినిమాలతో ఆకట్టుకుంటున్నారు.
రాఘవేంద్రరావుకి, రాజమౌళికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఫ్యామిలీల మధ్య అనుబంధం, రిలేషన్ ఉంది. రాఘవేంద్రరావు వద్ద రాజమౌళి పనిచేశారు కూడా. యాడ్స్ చేశారు. టీవీ సీరియల్ కూడా డైరెక్ట్ చేశారు. రాజమౌళి వర్క్ నేర్చుకుందంటే రాఘవేంద్రరావు వద్దే అని చెప్పొచ్చు.
photos-soundarya lahari
అయితే ఆ సమయంలో ఓ సందర్భంలో రాఘవేంద్రరావు.. రాజమౌళిని టార్చర్ చేశారట. ఈ విషయాన్ని జక్కన్నే వెల్లడించారు. ఆ రోజుకు తనకు పెద్ద టార్చర్ అని చెప్పాడు. ఆయన కారులో కూర్చోవాలంటే భయమేసిందట. భయపడుతూనే కూర్చున్నాడట. ఆ సమయంలో చుక్కలు కనిపించాయని తెలిపారు రాజమౌళి. మరి ఇంతకి ఏం జరిగిందంటే..
ఓ రోజు రాఘవేంద్రరావు ఇంటికి వెళ్తే ఆయన వైట్ కారు, నిగనిగ మెరుస్తుందట. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ నీట్గా టర్కీ టవల్ వేసి ఉంటుందట, అది ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత వైట్గా ఉంటుందట. ఆ రోజు బయటకు వెళ్లాల్సి వచ్చింది. రా రాజమౌళి అని తనని పిలిచాడట రాఘవేంద్రరావు. డ్రైవర్ లేకపోవడంతో తనే డ్రైవ్ చేస్తున్నాడు. తాను ఎక్కడ కూర్చోవాలనేది పెద్ద ప్రశ్న.
photos-soundarya lahari
తాను డర్టీగా ఉన్నాడట. ఫ్రంట్ సీట్లో కూర్చొంటే ఆ టవల్ మాసిపోతుందేమో అని బయపడ్డాడట. వెనకాల కూర్చుంటే రాఘవేంద్రావు డ్రైవ్ చేస్తుంటే తాను వెనకాల కూర్చుంటే బాగోదు అనిపించిందట. ఎట్టకేలకు ముందు సీట్లోనే కూర్చున్నాడట. కానీ సీట్ ఎడ్జ్లో కూర్చుని కూర్చోనట్టుగా భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడట. ఆ జర్నీ అయిపోయేంత వరకు చుక్కలు కనిపించాయని, అదొక పెద్ద నరకం అని బాంబ్ పేల్చాడు రాజమౌళి.
photos-soundarya lahari
రాఘవేంద్రరావు జర్నీని తెలియజేసేలా `సౌందర్యలహరి` టాక్ ని రన్ చేసిన విషయం తెలిసిందే. దీనికి రాజమౌళి, ప్రభాస్ గెస్ట్ లుగా వచ్చారు. ఆసమయంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు జక్కన్న. రాఘవేంద్రరావు ముందే ఈ విషయాన్ని చెప్పడం విశేషం. అయితే దీన్ని అందరు ఫన్నీగా తీసుకున్నారు. నవ్వులు చిందించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు, ఎన్టీఆర్ సినిమాలు సంబంధించిన సీన్లపై చర్చించారు. `బాహుబలి` సమయంలో ఈ చర్చ నడిచింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇక ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో `ఎస్ఎస్ఎంబీ29` చిత్రంపై బిజీగా ఉన్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుందని తెలుస్తుంది. అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. మరోవైపు రాఘవేంద్రరావు దర్శకుడిగా సినిమాలు మానేసి టీవీ సీరియల్స్, ఓటీటీ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నారు.