నమ్మి మోసపోవడం నా తప్పే.. బాలయ్య మూవీ విషయంలో స్టార్ డైరెక్టర్ అంతగా హర్ట్ అయ్యారా ?
నందమూరి బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా హిట్ మూవీ లేక సతమతమయ్యారు. లక్ష్మి నరసింహ తర్వాత బాలయ్యకి దాదాపు ఆరేళ్ళ పాటు సరైన హిట్ లేదు. బాలయ్య మార్కెట్ దెబ్బ తింటోంది అనుకున్న తరుణంలో వచ్చిన చిత్రం సింహా.
నందమూరి బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా హిట్ మూవీ లేక సతమతమయ్యారు. లక్ష్మి నరసింహ తర్వాత బాలయ్యకి దాదాపు ఆరేళ్ళ పాటు సరైన హిట్ లేదు. బాలయ్య మార్కెట్ దెబ్బ తింటోంది అనుకున్న తరుణంలో వచ్చిన చిత్రం సింహా. సింహా చిత్రమే బాలయ్య కెరీర్ కి తిరిగి ఊపిరి పోయింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్య కి కొత్త జోష్ ఇచ్చింది. బాలయ్య ఎలా కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారో అంతే పవర్ ఫుల్ గా బోయపాటి ప్రజెంట్ చేశారు. బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో నయనతార, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించారు.
ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి అయినప్పటికీ రచయితగా కొరటాల శివ పాత్ర ఎంతైనా ఉంది. అప్పటికి కొరటాల ఇంకా డైరెక్టర్ కాలేదు. కొరటాల శివ అందించిన కథ, మాటలు ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అయ్యాయి. కొరటాల శివ, బోయపాటి ఇద్దరూ పోసాని కృష్ణమురళి శిష్యులే. ఇప్పుడు వీళ్ళిద్దరూ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు.
అయితే సింహా చిత్రం విషయంలో వీళ్లిద్దరి మధ్య వివాదం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ ఈ అంశం గురించి సున్నితంగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అది జరిగి పోయిన విషయం. ఇప్పుడు అందరం బావున్నాం. స్టోరీ, డైలాగ్స్ క్రెడిట్ విషయంలోనేనా గొడవ అని ప్రశ్నించగా..నమ్మి మోసపోవడం మనదే తప్పు. అయితే ఇప్పుడు నేను ఎవరిని రెచ్చగొట్టాలని అనుకోవడం లేదు.
ఎక్కడో తప్పు మాత్రం జరిగింది. నేను మనస్థాపం చెందిన మాట వాస్తవం. నమ్మి మోసపోవడం చాలా మంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. నాక్కూడా జరిగింది. అది ఒక ఎక్స్ పీరియన్స్. జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని కొరటాల అన్నారు.
ఈ చిత్రానికి కొరటాల శివ అందించిన కథ, మాటలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా కొరటాల మాటలు రాశారు. బోయపాటి దర్శకత్వం కూడా ఇక్క హైలైట్. అన్ని అనుకూలంగా కుదరడం వల్ల సింహా చిత్రం సూపర్ హిట్ అయింది.
సినిమా క్రెడిట్ విషయంలో ఇప్పటికే టాలీవుడ్ లో చాలా వివాదాలు జరిగాయి. శ్రీనువైట్ల, కోన వెంకట్ మధ్య విభేదాలు వచ్చింది కూడా క్రెడిట్స్ వల్లే. కొరటాల శివ ప్రస్తుతం దర్శకుడిగా ఎన్టీఆర్ తో దేవర చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దేవర చిత్రంతో కొరటాల పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు.