రకుల్ ప్రీత్ సింగ్ సంచలన నిర్ణయం, సినిమాలు మానేసి ఏం చేయబోతుందంటే..?
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసింది బ్యూటీ. తాజాగా రకుల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది.
Rakul Preeth Singh
సినిమాలు చేస్తూ.. ఇతర రంగాల్లో అడుగు వేసిన తారలు చాలామంది ఉన్నారు. సినిమాలు ఆగిపోయినా.. వ్యాపారాలు చేసుకోవచ్చులే అన్న ధైర్యంతో ఇప్పుడు తారలంతా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో హీరోలకు పోటీగా హీరోయిన్లు కూడా ఇదే బాటపడుతున్నారు. సమంత, నయనతార, లాంటివారు ఈ విషయంలో ముందు ఉన్నారు. ఇక వారికంటేఓ అడుగు ముందుకేసింది రకుల్ ప్రీత్ సింగ్.
ఓ వైపు సినిమాల్లో బిజీగా నటిస్తూనే.. గార్మెంట్, హోటల్ బిజినెస్ లలో దిగుతున్నారు సెలబ్రిటీలు. ఇలా సినిమాలు చేసుకుంటూ వ్యాపారంలో అడుగుపెట్టిన వారి జాబితాల్లో ప్రముఖ నటి రకుల్ప్రీత్సింగ్ ఎప్పుడో చేరిపోయారు. ఈమధ్య అవకాశాలు తగ్గడం.. టాలీవుడ్ కు కంప్లీట్ గా దూరం అయిపోయింది రకుల్.
Rakul Preeth Singh
బాలీవుడ్ లో అడపాదడపా ప్రాజెక్ట్ లు చేస్తూ వస్తోంది. ఇక తన పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా వివాహబంధంలోకి అడుగుపెట్టింది.
ప్యాపారవెత్తా.. నిర్మాత, నటుడు అయినా జాకీ భగ్ననిని పెళ్లాడిన రకుల్ ప్రీత్.. ఇప్పటికే వ్యాపార రంగంలో ఆరితేరినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్టణం తదితర నగరాల్లో ‘ఎఫ్ 45’ పేరుతో జిమ్స్ పార్లర్ ను నిర్వహిస్తున్నారు రకుల్. అలాగే, వెల్బీయింగ్ న్యూట్రిషన్, వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి.
Rakul Preeth Singh
అంతే కాకుండా.. 2019లో న్యూబూ పేరుతో బయోడీగ్రేడబుల్, రీయూజబుల్ డైపర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు కూడా . తాజాగా ఇప్పుడు ఫుడ్ బిజినెస్లోకి కూడా అడుగు పెట్టబోతోందటర రకుల్ ప్రీత్ సింగ్. అందులో భాగంగానే ‘ఆరంభం’ పేరుతో హైదరాబాద్లోని మాదాపూర్లో ఈ నెల 16న ఓ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారని సమాచారం.
Rakul Preeth Singh
. ప్రముఖ కిచెన్ ఆపరేటర్ ‘క్యూర్ఫుడ్స్’తో కలిసి సంయుక్తంగా ఈ బిజినెస్ ను చేయబోతున్నారట రకుల్. అయితే రకుల్ స్టార్ట్ చేయబోయే ఈ ఫుడ్ బిజినెస్ లో ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో తృణధాన్యాలతో తయారుచేసే వంటకాలు లభిస్తాయి. ఫుడ్బిజినెస్లో అడుగుపెట్టబోతున్నందుకు రకుల్ సంతోషం వ్యాక్తం చేశారు. అయితే అందరికి ఆరోగ్యకరమైన.. న్యూట్రీషన్ ఫుడ్ అందించాలి అనేది తన కోరిక అంటోంది రకుల్.