Asianet News TeluguAsianet News Telugu

పుష్ప2` టైటిల్‌ సాంగ్‌ ప్రోమో వచ్చింది.. పూర్తి పాట వచ్చేది అప్పుడే.. ప్రోమో ఎలా ఉందంటే?

`పుష్ప2` నుంచి మరో సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఫస్ట్ సాంగ్‌ ప్రోమోని విడుదల చేశారు. మొదటి పాటగా `పుష్ప` టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. అసలు పాట అప్పుడే రాబోతుంది.
 

pushpa2 first song pushpa release time how is promo arj
Author
First Published Apr 24, 2024, 5:05 PM IST

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న భారీ మూవీ `పుష్ప2`. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. `కల్కి2898ఏడీ` కంటే ఈ మూవీకే ఎక్కువగా బజ్‌ ఉండటం విశేషం. ఇటీవల వచ్చిన గ్లింప్స్ ఆ రేంజ్‌లో బజ్‌ పెంచింది. అల్లు అర్జున్‌ కొత్త గెటప్‌లో కనిపించి అదరగొట్టాడు. అమ్మోరు లుక్లో ఆయన చేసిన హంగామా నెక్ట్స్ లెవల్. పైగా చీరకట్టి యాక్షన్‌ చేస్తే స్క్రీన్లు పగిలిపోవాల్సిందే అనేట్టుగా ఈ గ్లింప్స్ ఉంది. 

తాజాగా మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీ నుంచి సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. `పుష్ప` పేరుతోనే మొదటి సాంగ్‌ని తీసుకురాబోతున్నారు టీమ్‌. తాజాగా ఈ పాట ప్రోమో విడుదలైంది. `పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్ప` అంటూ సాంగే ప్రోటో ఓకే అనిపిస్తుంది. అయితే పాట ఎలా ఉంటుందనే దానిపై ఎలాంటి రిఫరెన్స్ ఇవ్వలేదు. ప్రోమోగా మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేదు. పూర్తి పాట వస్తేగానీ ఈ సాంగ్ ఎలా ఉంటుందో చెప్పగలం. మే 1న ఉదయం 11.07గంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 

`పుష్ప`కి కూడా ఆయనే మ్యూజిక్‌ డైరెక్టర్. అందులోని అన్ని పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. చార్ట్ బస్టర్ గా ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. దీంతో `పుష్ప2` ఆల్బమ్ పై అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునే మ్యూజిక్ ఉంటుందా అనేది మున్ముందు చూడాలి. అయితే అల్లు అర్జున్‌, సుకుమార్‌, డీఎస్పీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీంటిలోనూ మ్యూజిక్‌ ఆల్బమ్స్ పరంగా సూపర్‌ హిట్‌ అయ్యాయి. దీంతో `పుష్ప2` కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నారు వారి అభిమానులు. 

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న నాల్గో చిత్రమిది. `ఆర్య` `ఆర్య2`, `పుష్ప` చిత్రాలు వచ్చి ఆకట్టుకున్నాయి. `పుష్ప` ఇండియా వైడ్‌గా కలెక్షన్ల దుమ్ము రేపింది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా బాగా ఆదరణ పొందింది. ఈ సినిమాకిగానూ బన్నీకి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా రావడం విశేషం. దీంతో పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని సుకుమార్‌ ఈ మూవీని రాజీ పడకుండా రూపొందిస్తున్నారు. ప్రతి సీన్‌ని చెక్కుతున్నాడట. సుమారు 80శాతం ఈ మూవీ చిత్రీకరణ పూర్తయ్యిందట. ప్రస్తుతం షూటింగ్‌ దశలో మూవీ ఉంది. త్వరగా పూర్తి చేసి ఆగస్ట్ 15న సినిమాని విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. ఫహద్‌ పాజిల్‌, సునీల్‌, అనసూయ, ధనుంజయ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios