Asianet News TeluguAsianet News Telugu

45 ఏళ్ళ వయసులో జ్యోతిక సాహసం.. ట్రెక్కింగ్ చేస్తూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి చేరుకున్న నటి జ్యోతిక, వీడియో 

చిత్ర పరిశ్రమలో సూర్య, జ్యోతిక జంటకి ఉన్న క్రేజ్ వేరు. ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. సూర్య ఒకవైపు స్టార్ హీరోగా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక జ్యోతిక కూడా తగ్గడం లేదు. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

Jyothika taking risk and treks everest base caamp dtr
Author
First Published Apr 29, 2024, 12:44 PM IST

చిత్ర పరిశ్రమలో సూర్య, జ్యోతిక జంటకి ఉన్న క్రేజ్ వేరు. ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. సూర్య ఒకవైపు స్టార్ హీరోగా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక జ్యోతిక కూడా తగ్గడం లేదు. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. జ్యోతిక లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. 

జ్యోతిక ఫిట్ నెస్ విషయంలో తీసుకునే కేరింగ్ అంతా ఇంతా కాదు. తరచుగా జ్యోతిక జిమ్ వర్కౌట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. అందుకే జ్యోతిక 45 ఏళ్ళ వయసులో కూడా సాహసాలు చేయగలుగుతోంది. తాజాగా జ్యోతిక కష్టసాధ్యమైన సాహసాన్ని చేసి చూపించింది. 

ఆమె హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎవరెస్టు బేస్ క్యాంప్ కి చేరుకుంది. గతంలో జ్యోతిక కశ్మీర్ లో ట్రెక్కింగ్ చేసింది. ఇప్పుడు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ని చేరుకోవడంతో ఆమె ఖాతాలో మరో ఘనత చేరింది. తన జర్నీకి సంబంధించిన వీడియో జ్యోతిక షేర్ చ్చేసింది. ఎవరెస్టు బేస్ క్యాంప్ 5000 పైగా మీటర్ల ఎత్తులో ఉంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyotika (@jyotika)

అక్కడ ఉన్న చిన్న చిన్న హోటల్స్ లో బస చేయడం.. ఫుడ్ తినడం లాంటి మెమొరీస్ ని వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది. దీనితో అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. ఎవరెస్టు బేస్ క్యాంప్ ని చేరుకున్న ఫస్ట్ హీరోయిన్ బహుశా జ్యోతిక నే ఏమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జ్యోతిక ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో జ్యోతిక, సూర్య కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్నట్లు కూడా కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios