Asianet News TeluguAsianet News Telugu

మరో అమ్మాయిపై మోజుతో.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు శిరోముండనం..

Crime News: తూర్పుగోదావరి జిల్లాలో వివాహితపై భర్త అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకునేందుకు దాడి చేసి.. ఆమెకు శిరోముండనం చేశాడు. అనంతరం ఆమె జుట్టును చుట్టు ప్రక్కల వారికి చూపిస్తూ.. హంగామా చేశాడు. అంతటితో ఆగకుండా శిరోముండనం చేసిన భార్యను ఊరంతా తిప్పి అమానవీయంగా ప్రవర్తించాడు.

East Godavari Pedakondepudi Husband Tonsures Wife's Head KRJ
Author
First Published Feb 3, 2024, 6:49 AM IST

Crime News: తూర్పుగోదావరి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దుర్మార్గుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకునేందుకు దాడి చేసి.. ఆమెకు శిరోముండనం చేశాడు. అనంతరం భార్య జుట్టును చుట్టు ప్రక్కల వారికి చూపిస్తూ.. హంగామా చేశాడు. అంతటితో ఆగకుండా శిరోముండనం చేసిన భార్యను ఊరంతా తిప్పి అమానవీయంగా ప్రవర్తించాడు. 

వివరాల్లోకెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం సీతానగరం మండలం పెద్ద కొండేపూడి గ్రామానికి చెందిన కర్రీ అభిరామ్ అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం షేక్ ఆశ అనే వివాహితను ప్రేమించి చేసుకున్నాడు. తొలుత వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఈ క్రమంలోనే వారికి ఒక బాబు పుట్టాడు.

కానీ, వేరే అమ్మాయి మోజులో పడ్డ అభిరామ్ తన భార్త ఆశను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు.  ఈ క్రమంలో తరుచు గొడవ పడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు.ఇలా ఆమెను దూరం పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలో పెద్దలు సర్ది చెప్పుతూ వచ్చారు.  కానీ, భార్య ఆశపై అయిష్టతతో గత కొన్ని రోజుల క్రితం ఆమెతో గొడవపడి ఇంటి నుంచి పంపిచేశాడు. దీంతో ఆమె తన బంధువుల ఇంట్లోనే ఉంటుంది.  

మరోవైపు.. అభిరామ్ కు మరో పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఆశ గత మూడు రోజుల క్రితం పెదకొండేపూడిలోని తన భర్త ఇంటికి వెళ్లింది. ఇంటికి వచ్చిన ఆశపై అభిరామ్ పైశాచికంగా వ్యవహరించాడు. ఇష్టానుసారంగా దాడి చేసి.. శిరోముండనం(గుండు గీశాడు) చేశాడు.  ఇంటినుండి బయటికి గెంటి వేశాడు.

అనంతరం భార్య జుట్టును చుట్టు ప్రక్కల వారికి చూపిస్తూ.. హంగామా చేశాడు. అంతటితో ఆగకుండా శిరోముండనం చేసిన భార్యను ఊరంతా తిప్పి అమానవీయంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీతానగరం పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని .. బాధితురాలిని  వైద్య పరీక్షలు నిమిత్తం రాజమండ్రికి తరలించారు. బాధిరాలు ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ ఐ రామకృష్ణ వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో శిరో ముండనం చేయకముందు తన భర్త వేధింపులను గురి చేస్తున్నాడనే ఓ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.  సినిమాలో చిన్నచిన్న పాత్రలు చేసుకుంటున్న తనను పెదకొండేపూడి చెందిన రాంబాబు ప్రేమించానని నమ్మించాడనీ, తనకు చిన్నతనంలో పెళ్లి జరిగిందని, ఒక బాబు కూడా ఉన్నాడని వెల్లడించినా తనను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడ్డాడనీ, భర్త చనిపోయి ఉన్న తనకు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తామిద్దరం ఓ చిన్న చర్చిలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లి అయినా ఒక్క సంవత్సరం వరకు బాగా చూసుకున్నాడని, అయితే.. తనకు తెలియకుండా మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడనీ, ఆ విషయం తనకు తెలియడంతో తనను తరుచు చిత్రహింసలకు గురి చేసేవాడని వీడియోలో ఆరోపించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios