Asianet News TeluguAsianet News Telugu

చారిత్రాత్మక క్షణం:తొలిసారిగా రూ. 400 లక్షల కోట్లకు చేరుకున్న బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్..

BSE మార్చి 2014లో మొదటిసారిగా రూ. 100 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను, ఫిబ్రవరి 2021లో రూ. 200 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించింది. జూలై 2023లో రూ. 300 లక్షల కోట్ల మైలురాయిని  ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత రూ. 400 లక్షల కోట్లకు చేరుకుంది.

Historic moment: BSE-listed firms' m-cap hits Rs 400 lakh crore for first time ever-sak
Author
First Published Apr 8, 2024, 12:37 PM IST

బ్లూ-చిప్, మిడ్-క్యాప్ అండ్ స్మాల్-క్యాప్ సూచీల ర్యాలీతో, BSEలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏప్రిల్ 8, 2024న మొదటిసారిగా రూ. 400 లక్షల కోట్లను దాటి లైఫ్ టైం హైకి చేరుకుంది.

BSE మార్చి 2014లో మొదటిసారిగా రూ. 100 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను, ఫిబ్రవరి 2021లో రూ. 200 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించింది. జూలై 2023లో రూ. 300 లక్షల కోట్ల మైలురాయిని  ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత రూ. 400 లక్షల కోట్లకు చేరుకుంది.

ఏప్రిల్ 2023 నుండి, BSE లిస్టెడ్ సంస్థలు కలిపి  మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 145 ట్రిలియన్లు లాభపడ్డాయి, ఇది 57% పెరుగుదలను సూచిస్తుంది. మంచి  హై-ఫ్రీక్వెన్సీ  ఇండికేటర్స్, బలమైన కార్పొరేట్ ఆదాయాలు, స్థిరమైన విధానాల కారణంగా   పెట్టుబడిదారుల సెంటిమెంట్ ఇంకా గణనీయమైన దేశీయ, అంతర్జాతీయ ఇన్‌ఫ్లోలు ఈ వృద్ధికి ఆజ్యం పోశాయి. మిడ్ అండ్  స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 60% ఇంకా  63% పెరిగాయి, లార్జ్‌క్యాప్ సెన్సెక్స్ ఇండెక్స్‌లో 28.6% పెరుగుదలను అధిగమించింది. ప్రముఖ రంగాలలో రియల్టీ, PSU బ్యాంకులు, ఆటో, ఎనర్జీ, ఇన్‌ఫ్రా అలాగే ఫార్మా ఉన్నాయి.

మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ ప్రకారం, భారతదేశ GDP FY25/26 నాటికి $4 ట్రిలియన్, FY34 నాటికి $8 ట్రిలియన్లను అధిగమించనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ స్టెబిలిటీ అంచనా వేస్తూ ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలు, క్యాపెక్స్ అండ్  తయారీపై ఎక్కువ దృష్టి పెట్టనుంది. 

గత కొన్ని ట్రేడింగ్ సెషన్‌లలో స్టాక్ మార్కెట్లు బ్రేకింగ్ రెసిస్టెన్స్ సంకేతాలను చూపించాయి, అయినప్పటికీ సంస్థాగత ప్రవాహాలు పెరుగుదలకు మద్దతు ఇవ్వలేదు. గత మూడు సెషన్లలో ఎఫ్‌ఐఐ దాదాపు రూ.2500 కోట్లను విక్రయించగా, గత రెండు సెషన్లలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు దాదాపు రూ.4000 కోట్లను విక్రయించారు.

ఏప్రిల్ 4న భారతీయ మార్కెట్లు కొత్త రికార్డు స్థాయిలను తాకాయి, అయితే ఏప్రిల్ 5న ఫ్లాట్‌గా ఉన్నాయి. ప్రవాహాల పునఃప్రారంభం అధిక స్థాయిలకు దారితీయవచ్చని విశ్లేషకులు తెలిపారు, అయితే కరెక్షన్ అండ్ కన్సాలిడేషన్ దశ ఆసన్నమైంది. Q4 ఆదాయాలు వాల్యుయేషన్‌లకు కీలకం, మార్కెట్ కరెక్షన్‌ను నివారించడానికి బలమైన సపోర్ట్  అవసరం, ప్రత్యేకించి పర్సనల్ స్టాక్‌లకు ఆదాయాలు వాల్యుయేషన్‌ల కంటే తక్కువగా ఉంటే.

ఏప్రిల్ 5న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా రెపో రేటును కొనసాగించింది. అయితే ద్రవ్యోల్బణం తగ్గింపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా సూచించింది.  మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును స్థిరంగా ఉంచడానికి 5-1తో ఓటు వేసింది, జయంత్ వర్మ వరుసగా రెండో సమావేశంలో  25-బిపి రేటు తగ్గింపు కోసం వాదించారు.
 

Disclaimer: The views and investment tips expressed by investment experts 

Follow Us:
Download App:
  • android
  • ios