Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి ఊరట.. స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 10,310 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 10,310 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,70,491కి చేరుకుంది.

10310 new corona cases reported in andhra pradesh
Author
Amaravathi, First Published Jan 30, 2022, 7:58 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 10,310 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,70,491కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,606కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 9,692 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 21,39,854కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 39,296 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,24,45,428కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,16,031 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 99, చిత్తూరు 411, తూర్పుగోదావరి 910, గుంటూరు 1249, కడప 1697, కృష్ణ 1008, కర్నూలు 1379, నెల్లూరు 927, ప్రకాశం 700, శ్రీకాకుళం 229, విశాఖపట్నం 853, విజయనగరం 222, పశ్చిమ గోదావరిలలో 626 చొప్పున వైరస్ బారినపడ్డారు.

మరోవైపు దేశంలో క‌రోనా(Coronavirus) ప్రభావం కొన‌సాగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త  కేసులు న‌మోద‌వుతున్నాయి. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెరిగాయి. కొత్త‌గా 893 మంది క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్త క‌రోనా (Coronavirus)మర‌ణాల సంఖ్య 4,94,091 పెరిగింది. ఇదే సమయంలో 2,34,281 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా వైరస్ బారినపడ్డవారి సంఖ్య 4,10,92,522 చేరుకుంది. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 18,84,937 క్రియాశీల కేసులు ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,52,784 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా వైర‌స్ (Coronavirus) నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,87,13,494కు పెరిగింది. 

మొత్తం (Coronavirus) కేసుల్లో యాక్టివ్ కేసులు సంఖ్య 4.59 శాతంగా ఉంది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 94.21 శాతానికి చేరుకుంది. అయితే, రోజువారీ పాజిటివిటీ రేటు 13 శాతం నుంచి 14.50 శాతానికి పెరగ‌డంపై ఆందోళ‌న వ్యక్త‌మ‌వుతోంది. డైలీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉండ‌గా, వారాంత‌పు క‌రోనా(Coronavirus) పాజిటివిటీ రేటు 16.40 శాతంగా ఉంది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశంలో వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌లు క‌ఠినంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వ్యాక్సినేష్ ప్ర‌క్రియ‌తో పాటు క‌రోనా ప‌రీక్ష‌లను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. 

ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 165.70 కోట్ల (Coronavirus) వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు. ఇందులో మొద‌టి డోసు తీసుకున్న వారు 89.3 కోట్ల మంది ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న‌వారి సంఖ్య 70.6 కోట్ల‌కు పెరిగింది. అలాగే, గ‌త 24 గంట‌ల్లో దేశంలో 16,15,993 క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 72.93 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని పేర్కొంది. దేశంలో క‌రోనా వైర‌స్  (Coronavirus) ఒమిక్రాన్ (Omicron)వేరియంట్ కేసులు సైతం పెరుగుతున్నాయి.  అయితే, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో  ఇదివరకు విధించిన కరోనా ఆంక్షలను సడలిస్తున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios