Tips
ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ తీసుకొస్తున్నారు. జనవరి 27 నుండి వారి డైరెక్ట్ టు సెల్ సాటిలైట్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ సేవలు ఎలా ఉపయోగపడనున్నాయంటే.
ఈ సేవలకు ప్రత్యేకంగా టవర్స్ అవసరం లేదు. మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్లోని శాటిలైట్ ఇంటర్నెట్ విభాగం స్టార్లింక్ 'డైరెక్ట్-టు-సెల్ శాటిలైట్' ప్రాజెక్ట్ను రూపొందించింది.
ఈ టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ వాడుకదారులకు నేరుగా ఉపగ్రహం నుంచి ఇంటర్నెట్ సేవలను పొందుతారు.
ఈ సరికొత్త టెక్నాలజీ సహాయంతో మొబైల్ టవర్స్ లేని అత్యంత మారుమూల గ్రామాల్లో కూడా ఇంటర్నెట్, మొబైల్ సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా పొందొచ్చు.
ఎలాన్ మస్క్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ టు సెల్ శాటిలైట్ పేరుతో తీసుకొచ్చారు. ఇందులో భాగంగా శాటిలైట్లు నేరుగా స్మార్ట్ఫోన్లు ఇతర మొబైల్ పరికరాలకు కనెక్ట్ అవుతాయి.
ఈ టెక్నాలజీతో పర్వతాలు, ఎడారులు, సముద్ర ప్రాంతాలు ఇలా.. ఇప్పటి వరకు ఇంటర్నెట్, మొబైల్ టవర్ సౌకర్యాలు లేని ప్రదేశంలో కూడా టెలికం సేవలు లభించనున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ టవర్లు దెబ్బతింటే అంతరాయం ఏర్పడుతుంటాయి. అయితే ఈ శాటిలైట్ నెట్వర్క్ కమ్యూనికేషన్ లో ఇలాంటి సమస్యే ఉత్పన్నం కాదు.
దీంతో ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ విప్లవం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొబైల్ నెట్వర్క్ అందని ప్రదేశాలు ఇప్పుడు ఈ టెక్నాలజీతో కవర్ కానున్నాయి.