NATIONAL

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? ఏం చేయాలో తెలుసా?

పీఎం కిసాన్ 18వ విడత

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) పథకం కింద డబ్బులు జమ చేశారు. అయితే, అర్హులైనా ఖాతాలో డబ్బులు జమ కాకపోతే చింతించాల్సిన అవసరం లేదు.

రైతులకు ఏడాదికి 6 వేలు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి ఏటా రైతులకు 6 వేల రూపాయలు అందిస్తారు. ప్రతి 4 నెలలకు ఒకసారి 2-2 వేల చొప్పున విడతల వారీగా జమ చేస్తారు. 

PM Kisanలో ఎంతమంది రైతులు

జూన్ 2024లో విడుదలైన విడతతో పోలిస్తే ఈసారి దాదాపు 25 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే, కేవైసీ పూర్తి కాకపోవడంతో చాలా మంది రైతులు నిరాశ చెందాల్సి వస్తుంది.

ఎవరికి PM Kisan ప్రయోజనం

పీఎం కిసాన్ పథకం ప్రయోజనం కోసం ప్రమాణాలను నిర్దేశించారు. 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం లభిస్తుంది.

PM Kisan అర్హత ఎలా చెక్ చేసుకోవాలి

పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి లబ్ధిదారుల జాబితా లింక్ పై క్లిక్ చేసి అన్ని వివరాలు నమోదు చేసి గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేసి జాబితాలో మీ పేరును పరిశీలించుకోవచ్చు.

PM Kisan డబ్బులు రాకపోతే ఏం చేయాలి

అర్హత ఉండి కూడా పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం పలు మార్గాలను సూచించింది. pmkisan-ict@gov.in కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

PM Kisan కోసం హెల్ప్‌లైన్ నెంబర్

మీరు మెయిల్ చేయలేకపోతే.. 155261 లేదా 1800115526 హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. అలాగే, 011-23381092 నెంబర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Find Next One