ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రియలన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీకి ఖరీదైన బంగ్లాను బహుమతిగా ఇచ్చారు.
ముఖేష్, నీతా అంబానీ కొడుకు, కోడలు కలిసి ఉండేందుకు దుబాయ్లో బంగ్లా బహుమతిగా ఇచ్చారు.
అనంత్, రాధికల దుబాయ్ బంగ్లా ఖరీదు కోట్లాది రూపాయలు. ఇంతకీ బంగ్లాలో ఉన్న విశేషాలు ఏంటంటే.
ముఖేష్, నీతా అంబానీ తమ కొడుకు, కోడలికి దాదాపు రూ.650 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను బహుమతిగా ఇచ్చారు.
అనంత్, రాధికల బంగ్లాలో 10 గదులు, ప్రైవేట్ బీచ్ ఉన్నాయి.
అంతేకాకుండా బంగ్లాలోనే ప్రత్యేకంగా 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ ను కూడా ఏర్పాటు చేశారు.
బంగ్లాలో రెండు స్విమ్మింగ్ పూల్స్, 7 స్పాలు ఉన్నాయి.
బంగ్లాలో అత్యంత ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ ను ఉపయోగించారు.
నీతా అంబానీ ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఖరీదైన ఫర్నిచర్తో బంగ్లాను అలంకరించారు.