Asianet News TeluguAsianet News Telugu

రేడియాలో పాట విని ఆత్మహత్య చేసుకున్న వందలాది మంది?

అది  హంగేరీ దేశం అప్పుడే ఒకటో ప్రపంచ యుద్ధం ముగిసింది. వార్ కారణంగా ఆ దేశ చాలా వరకు నష్టపోయారు. అప్పుడప్పుడే  ఆ యుద్దం సృష్టించిన బీభత్సం నుండి  ఆ దేశంలోని బుడాపెస్ట్ వాసులు నెమ్మదిగా తేరుకుంటున్నారు. అంతలో ...

The Creepy Story of How Budapest Became a "City of Smiles" in the 1930s
Author
Hyderabad, First Published Dec 24, 2019, 12:57 PM IST

వందలాది మంది ఒకరి తర్వాత ఒకరు ఏమైందో ఏమో తెలియదు   వంతెనలు, భవనాల మీదకు ఎక్కి దూకేస్తున్నారు. దీంతో పోలీసుల్లో అయోమాయం వందలాది మంది వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకోవడంతో  వారిలొ కలవరం మెుదలైంది. అలా ఆత్మహత్య చేసుకున్న వారిలో కొంతమంది ప్రాణాలతో బయటపడగా.. కొందరు ప్రాణాలు విడిచారు. 

దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా ఈ అత్యహత్యలను అపాలని నిర్ణయించుకున్నారు.  ఎక్కువ మంది నీటీలో దూకి చనిపోతున్నారని గుర్తించిన వారు ఎలాగైనా వారిని అపాలని ఓ పెద్ద మెుత్తంలో పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. అసలు ఇది ఎక్కడ, ఎందుకు ఇలా జరుగింది అనే ప్రశ్నకు జవాబు కావలంటే ఆ కథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం!

అది  హంగేరీ దేశం అప్పుడే ఒకటో ప్రపంచ యుద్ధం ముగిసింది. వార్ కారణంగా ఆ దేశ ప్రజలు చాలా వరకు నష్టపోయారు. అప్పుడప్పుడే  ఆ యుద్దం సృష్టించిన బీభత్సం నుండి  ఆ దేశంలోని బుడాపెస్ట్ వాసులు నెమ్మదిగా తేరుకుంటున్నారు. అంతలో అక్కడ మరో సమస్య మెుదలైంది. ఉన్నంట్టుండి ఆత్మహత్యలు చేసుకొనేవారి సంఖ్య పెరిగిపోయింది. 

దీంతో అక్కడి ప్రభుత్వం,పోలీసులలో కలవరం మెుదలైంది.  ఎలాగైనా అత్మహత్య చేసుకునేవారిని నిలవారించాలి అనుకున్నవారు. ఎక్కువ మంది నదులలో దూకి సుసైడ్ చేసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించారు. దీంతో నదుల వద్ద పోలీస్ బలగాలను   పహారా ఉంచారు అధికారులు. ఎవరైనా నదిలోకి దూకేస్తే వెంటనే వారిని రక్షించేవారు. 

అయిన కూడా ఆత్మహత్య ప్రయత్నాలు మాత్రం తగ్గలేదు. వారు ఆత్మహత్యలు చేసుకోడానికి గల కారణాలను అధికారులు అన్వేషించారు. ఆ చావులు కారణం డిప్రషన్ అని తెలుసుకున్నారు. దీంతో ఎలాగైనా వారికి మానసిన స్థైర్యాన్ని ఇవ్వాలని భావించారు. వెంటనే దేశం మెుత్తం కౌన్సెలింగ్ సెంటర్స్‌ను ప్రారంభించారు. అయిన  కూడా  మార్పు రాకపోవడంతో అత్మహత్యలు గల అసలు కారణం  ఏంటో  వారికి అంతుచిక్కకుండా పోయింది.   

యుద్ద సమయంలో మనో స్థైర్యంతో ఉన్న ప్రజలు  ఇప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారనే ప్రశ్న  వారిని దీర్ఘాలోచనలో పడేసింది. చివరకు దీనిపై  ఓ విచారణ కమీటి ఏర్పాటు చేశారు.  అత్యహత్యకు ప్రయత్నించిన వారిని కౌన్సెలింగ్‌ ప్రదేశాలకు వెళ్ళి ఆ కమీటి విచారించింది.  వారు చేప్పిన సమాధానం విని సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.  ప్రతిరోజు రేడియోలో వచ్చే ‘గ్లూమీ సండే’ అనే పాట తమను ఆత్మహత్య ప్రయత్నానికి కారణమైంది వారు తెలిపారు. దీంతో వెంటనే ఆ పాట ఎక్కడ ప్రసారం కాకుండా నిలిపివేశారు. అప్పడు అత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. 


ఇక పాట విషయానికి వస్తే రెజెసో సెరెస్ అనే సంగీత దర్శకుడు ఈ సాంగ్‌ను స్వరపరిచారు.  1941లో బీబీసీ బిల్లీ హాలీడే వెర్షన్ పేరిట పాటను విడుదల చేసింది. అత్మహత్యలను నివారించి ప్రజల్లో జీవొతంపై ఆశ కల్పించడం కోసం   ‘స్మైల్ క్లబ్’ను ఏర్పాటు చేశారు. పలు హప్య సన్నేవేశాలను వారికి చూపించి బతుకుపై ఆశను కల్పించారు. చూశారా ఒక్క  పాట ఏంతటి ప్రళయాన్ని సృష్టించిందో. 

Follow Us:
Download App:
  • android
  • ios