Asianet News TeluguAsianet News Telugu

అమ్మాయిల హాస్టల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థి... స్పందించిన విద్యామంత్రి

నూజివీడు ట్రిపుల్ ఐటీ అమ్మాయిల హాస్టల్లో అబ్బాయి ప్రవేశించి పట్టుబడిన ఘటనపై విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. 

minister adimulapu suresh reacts on nuzvid incident
Author
Nuzvid, First Published Feb 26, 2020, 7:54 PM IST

నూజివీడు ఐఐఐటీ ఘటనలో ఇటీవల వెలుగుచూసిన ఘటనపై విచారణ కోసం ఓ కమిటీ వేసినట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. దీనిపై నివేదిక వచ్చాకే చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. అప్పటివరకు ఈ ఘటనపై ప్రభుత్వం తరపున ఎలాంటి యాక్షన్ తీసుకోబోమని... తప్పెవరిదో తేలితే మాత్రం కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. 

కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఇటీవల ఓ ఘటన కలకలం రేపింది. విద్యార్ధినుల వసతి గృహంలో ఓ యువకుడు ప్రవేశించి రెడ్ హ్యాండెడ్ గా సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డాడు. విద్యార్ధినుల హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడు రోజంతా అక్కడే ఉన్నాడు. విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఆ యువకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

read more  సమస్యలెన్ని ఎదురైనా అది చేసి తీరతాం...: మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు

దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రిపుల్ ఐటీ యాజమాన్యం.. అతను లేడిస్ హాస్టల్‌లోకి ప్రవేశించడానికి సాయం చేసిన ఆరుగురు విద్యార్ధినులను సస్పెండ్ చేసింది. అమ్మాయిలు ఉండాల్సిన హాస్టల్‌లో యువకుడు ఉండటం క్యాంపస్‌లో కలకలం రేపుతోంది. 

ఆ యువకుడు కూడా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి ఐఐఐటీలో ఒక ఫెస్ట్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఓ విద్యార్ధి పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్‌లోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది.

కిటికీ ఊచలను విరగ్గొట్టి అతను గదిలోకి ప్రవేశించినట్లుగా సమాచారం. అతనిని లోపలే ఉంచే ఆ గదికి చెందిన విద్యార్ధినులు బయటకు వెళ్లినట్లుగా ట్రిపుల్ ఐటీ యాజమాన్యం గుర్తించింది.

read more  ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ దిశగా అడుగులు... సీఎం జగన్ ఆదేశాలు

ఈ వ్యవహారంతో ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపం మరోసారి వెలుగుచూడటంతో యాజమాన్యం సీరియస్ అయ్యింది. ఇప్పటికే విద్యార్ధుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనిపైనే తాజాగా విద్యామంత్రి స్పందించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios