Asianet News TeluguAsianet News Telugu

వృద్ధదంపతులను వాటర్ ట్యాంక్ ఎక్కించిన భూవివాదం (వీడియో)

భూవివాదంలో తమకు రావాల్సిన డబ్బుల కోసం ఓ వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. కృష్ణాజిల్లా, ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు హరిచంద్రపురానికి చెందిన చిలకపాటి వాసుదేవరావు, లక్ష్మి దంపతులు పెట్రోల్ క్యాన్ తో సహా గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కారు. తమకు రావాల్సిన డబ్బులు గ్రామపెద్దలు తమదగ్గరే పెట్టుకుని ఇవ్వడంలేదని ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం జరగకుండా ఎవరైనా తమను దింపటానికి ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని తగులబెట్టకుంటామని బెదిరిస్తున్నారు.

భూవివాదంలో తమకు రావాల్సిన డబ్బుల కోసం ఓ వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. కృష్ణాజిల్లా, ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు హరిచంద్రపురానికి చెందిన చిలకపాటి వాసుదేవరావు, లక్ష్మి దంపతులు పెట్రోల్ క్యాన్ తో సహా గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కారు. తమకు రావాల్సిన డబ్బులు గ్రామపెద్దలు తమదగ్గరే పెట్టుకుని ఇవ్వడంలేదని ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం జరగకుండా ఎవరైనా తమను దింపటానికి ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని తగులబెట్టకుంటామని బెదిరిస్తున్నారు.