
కాశ్మీర్ నుంచి పర్యాటకులను తరలించేందుకు స్పెషల్ వందే భారత్ రైలు
పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టేందుకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇప్పటికే పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్ర ముఠాలకు మద్దతు పలుకుతున్న పాక్.. ఎదురు దాడికి దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ నుంచి పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక వందే భారత్ రైలును ఏర్పాటు చేసింది.