
Pahalgam Attack: ఉగ్రవాదులను వదిలిపెట్టం.. ఎవరూ ఊహించని రీతిలో బదులిస్తాం: రాజ్నాథ్ సింగ్
పహల్గాం ఉగ్ర దాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎవరూ ఊహించని రీతిలో బదులిస్తామని శపథం చేశారు. త్రివిధ దళాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ లో భద్రతా పరిస్థితులను సమీక్షిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.