
అంత సీరియస్ అనుకోలేదు.. మోదీగారికి థాంక్స్: Pawan Kalyan on Mark Shankar health
సింగపూర్ లో చదువుతున్న స్కూల్ లో అగ్నిప్రమాదంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తదితరులు తన కొడుకు ఆరోగ్యం గురించి వాకబు చేశారని తెలిపారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.