
జయహో అమరావతి.. ఏపీలో కీలక ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం
అమరావతి రాజధాని పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునః ప్రారంభించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఏర్పాటు చేసిన సభా వేదిక నుండి 58 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పవిత్రమైన అమరావతి భూమిపై నిలబడి తాను ఒక నగరాన్ని మాత్రమే కాకుండా ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రను చూస్తున్నానని పేర్కొన్నారు.