పాక్ కి వణుకు పుట్టిస్తున్న భారత్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్

Share this Video

పాక్ నుంచి వచ్చిన 8 క్షిపణులను భారత వాయుసేన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించి విజయవంతంగా అడ్డుకుంది. జమ్మూ ప్రాంతంలో సాంబా, ఆర్నియా, ఆర్.ఎస్. పురా, సివిల్ ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాంతాలపై దాడికి వస్తున్న క్షిపణులను S-400 వ్యవస్థ వెంటనే గుర్తించి నిర్వీర్యం చేసింది. రష్యా సంస్థ ఆల్మాజ్-అంటే తయారుచేసిన ఈ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ పరిధి గల మిస్సైల్ షీల్డ్‌గా పేరుగాంచింది. దీని సహాయంతో భారతదేశం తన గగనతలాన్ని మరింత సురక్షితంగా ఉంచుతోంది.

Related Video